మూడో సినిమా చేయనున్న ఉయ్యాలా జంపాలా జోడీ

సినిమా రంగం లో సెంటిమెంట్ లకు కొదవ ఉండదు. ఇక్కడ హిట్ సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు బాగా ఉంటుంది. ఆ క్రమం లో హిట్ సినిమాలో నటించిన హీరో ,హీరోయిన్ లకు హిట్ పెయిర్ అని ముద్ర వేసి ఛాన్స్ లిస్తారు. అలా హిట్ పెయిర్ గా ముద్ర పడ్డ రాజ్ తరుణ్ , అవికాగోర్ జోడీ ఇపుడు మూడో సినిమాలో దర్శనమివ్వ బోతున్నారు. వీరిద్దరూ 2013 లో విడుదల అయిన ` ఉయ్యాలా జంపాలా […]

Written By: admin, Updated On : April 28, 2020 12:19 pm
Follow us on


సినిమా రంగం లో సెంటిమెంట్ లకు కొదవ ఉండదు. ఇక్కడ హిట్ సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు బాగా ఉంటుంది. ఆ క్రమం లో హిట్ సినిమాలో నటించిన హీరో ,హీరోయిన్ లకు హిట్ పెయిర్ అని ముద్ర వేసి ఛాన్స్ లిస్తారు. అలా హిట్ పెయిర్ గా ముద్ర పడ్డ రాజ్ తరుణ్ , అవికాగోర్ జోడీ ఇపుడు మూడో సినిమాలో దర్శనమివ్వ బోతున్నారు. వీరిద్దరూ 2013 లో విడుదల అయిన ` ఉయ్యాలా జంపాలా ‘ చిత్రంతో హీరో ,హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో ” సినిమా చూపిస్తమావ” చిత్రంలోనూ కల్సి నటించారు. .ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఈ జోడీ మరో సినిమాలో కలిసి నటించలేదు.

ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఈ జోడీ మళ్లీ వెండితెరపై కనపడనుంది. గతంలో రాజ్ తరుణ్ తో ” సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ” సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరో , హీరోయిన్ లుగా రాజ్ తరుణ్ , అవికాగోర్ ని ఎంపిక చేసుకొన్నాడు. గత మూడేళ్ళ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కనీసం ఈ చిత్రం తో నైనా తన పూర్వ వైభవం తనకు వస్తుందని ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమా మొదలెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది .