Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. కొత్త కోణంలో అంటూ టాక్..

Radhe Shyam: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. కొత్త కోణంలో అంటూ టాక్..

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా చిత్ర యూనిట్ రాధే శ్యామ్ టీజర్ ను రిలీజ్ చేసింది. సాహో సినిమా తర్వాత ప్రభాస్ సినిమా కోసం అభిమానులు గత రెండున్న‌రేళ్లుగా ఎదురుచూస్తున్న వేళ టీజర్ అలరించింది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది.

radhe-syam-is-a-remixed-biopic-of-the-astrologer-legend- chairo

నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను.. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుని కాదు మీలో ఒక్కడిని కూడా కాదు. అంటూ ప్రభాస్ బ్లాక్ డ్రస్ లో స్టైలిష్ లుక్ లో ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

రాధేశ్యామ్ సినిమా బయోపిక్ అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నిజజీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాకు పూర్తి కమర్షియల్ హంగులు జోడించినట్లు టాక్. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం ఆధారంగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కినట్లు టాక్. ఐరిష్ కు చెందిన జ్యోతిష్కుడు విలియం జాన్ వార్నర్ తన హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రంతో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచాడు. చెయిరోగా ప్రఖ్యాతి గాంచాడు. 1880లో భారతదేశంలో జ్యోతిషశాస్త్ర నైపుణ్యాన్ని నేర్చుకున్న చెయిరో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. అప్పట్లో రాజుల మరణాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లను ముందుగానే జ్యోతిష్యం చెప్పి చేయరో ఎందరినో షాక్ కు గురిచేశాడు. చేయిరో జీవితం పై ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పలు సినిమాలు తెరకెక్కాయి.

ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ఈ ప్రసిద్ధ పామిస్ట్ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారట.  అయితే “రాధే శ్యామ్” సినిమా ద్వారా ఈ ప్రముఖ హస్తసాముద్రికుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన మరియు ఎవరికీ తెలియని విషయాలను సినిమాలో చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబందించిన కథ పై ఇప్పటి వరకూ ఉహాగాలు..ఇది స్టోరీ అంటూ చిత్ర యూనిట్ ఒక్క మాట కూడా చెప్పకుండా సైలెన్స్ ను మెయింటేన్ చేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో ఆకట్టుకున్న ‘రాధేశ్యామ్’ సినిమాగానూ అలరిస్తుందని భావిస్తున్నారు. ఇందులో పూజా హేగ్డే కథానాయిక కాగా యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version