Pushpa Record: తొలిరోజు కలెక్షన్లతో ఆల్​ఇండియా రికార్డును నెలకొల్పిన ‘పుష్ప’రాజ్​.. తగ్గేదె లే

Pushpa Record: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప .. పుష్ప.. ఈ పేరు తప్ప ఇంకేం వినిపించడం లేదు. సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను సుకుమార్ ఎంతో చాకచక్యంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు థియేటర్లలలోకి వచ్చిన తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం […]

Written By: Raghava Rao Gara, Updated On : December 19, 2021 9:10 am
Follow us on

Pushpa Record: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప .. పుష్ప.. ఈ పేరు తప్ప ఇంకేం వినిపించడం లేదు. సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను సుకుమార్ ఎంతో చాకచక్యంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు థియేటర్లలలోకి వచ్చిన తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డుల మోతం మోగిస్తున్నారు పుష్పరాజ్.  తాజాగా, ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప రికార్డును నెలకొల్పింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3వేల థియేటర్లకు పైగా విడుదలైన ఈ సినిమా.. మొత్తంగా రూ. 71 కోట్ల గ్రాస్​ను రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. 2021లో తొలిరోజే ఈ రేంజ్​ కలెక్షన్లు రాబట్టిన తొలి భారతీయ సినిమా పుష్పనే అని అంటున్నారు.  మరోవైపు పుష్ప సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్​ కోసం సుమారు 180కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బడ్జెట్​లో ఉన్న క్వాలిటీ.. సినిమాలో లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్​ విషయంలో సుకుమార్​ ఎంత జాగ్రత్త వహిస్తారో అందరికి తెలిసిందే.

గతంలో ఆయన తెరకెక్కిన సినిమాలన్నీ హాలీవుడ్​ ఇన్​స్పిరేషన్​తోనే తీసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు పుష్పిలో ఆ మార్క్ ఎక్కడా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇందులో అనసూయ, సునీల్​ మునుపెన్నడూ లేని విభిన్న పాత్రల్లో కనిపించారు. రావు రామేశ్​ తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.