Puri Jagannadh: మన టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్స్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా పూరి జగన్నాథ్ పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన ఫార్మ్ లో లేదు , చాలా చెత్త సినిమాలు ఈమధ్య కాలంలో వరుసగా తీస్తూ వస్తున్నాడు, అయినప్పటికీ జనాల్లో పూరి జగన్నాథ్ కి ఇంతటి క్రేజ్ ఉండడానికి కారణం , ఆయన గతం లో ఎలాంటి సినిమాలు తీసేవాడో అందరికీ తెలుసు కాబట్టి. బద్రి , పోకిరి , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు , శివమణి, చిరుత, బుజ్జిగాడు , టెంపర్, బిజినెస్ మ్యాన్ , ఇలా ఒక్కటా రెండా?, ఎన్నో కల్ట్ క్లాసిక్ కమర్షియల్ సినిమాలను అందించిన లెజెండ్ ఆయన. అలాంటి డైరెక్టర్ నేడు తీస్తున్న సినిమాలు చూస్తుంటే ఆయన్ని అభిమానించే వాళ్లకు ఎంత బాధగా ఉంటుందో మాటల్లో వర్ణించలేము.
ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనతో మాట్లాడిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నా సినిమా ఒకటి ఫ్లాప్ అయ్యినప్పుడు , ఒకరి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆయన ఎవరో కాదు , విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన నాకు ఫోన్ చేసి ఒక సహాయం కోరారు, ఏంటి సార్ అని అడగ్గా, ఇక నుండి నువ్వు తీసే సినిమాలు తీసేముందు , ఒక్కసారి నాకు నీ స్టోరీలను వినిపించు , ఎందుకంటే నీలాంటి గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ఇలాంటి ఫ్లాప్స్ ని అందుకోవడం చూడలేకపోతున్నాను అని అన్నాడు. ఆయన మాట్లాడిన మాటలకు , చూపిన ప్రేమకు ఎంతో ఎమోషనల్ అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ పడ్డ బాధనే ఇప్పుడు తెలుగు ప్రజలు పూరి జగన్నాథ్ విషయం లో పడుతున్నారు.
పూరి జగన్నాథ్ లో క్రియేటివ్ డైరెక్టర్ , డైలాగ్ రైటర్ ఇంకా బ్రతికే ఉన్నాడు , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఆయనలోని రైటర్ చనిపోయాడు. ఇది కచ్చితంగా ప్రతీ ఒక్కరు నమ్మాల్సిందే. టెంపర్ చిత్రాన్ని ఎలా అయితే ఆయన వక్కంతం వంశీ స్టోరీ ని తీసుకొని తెరకెక్కించాడో , అలా ఒక రైటర్ అందించే స్టోరీలను తన దర్శకత్వ ప్రతిభ తో తెరకెక్కిస్తే , పూరి జగన్నాథ్ ని మించిన డైరెక్టర్ ఇప్పటికీ ఇండియా లో ఉండదు. కానీ ఆ దిశగా పూరి జగన్నాథ్ అసలు అడుగులు వేయడం లేదు. అదే అభిమానుల్లో నెలకొన్న బాధ. లేటెస్ట్ గా ఆయన విజయ్ సేతుపతి తో ‘స్లం డాగ్’ అనే చిత్రం చేశాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది, అభిమానులు పెదవి విరిచారు, మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
