Ketan Agarwal Death: ఇది మామూలు గుండె కోతకాదు.. కళ్ళముందే పెళ్లీడుకొచ్చిన కుమారుడు హత్యకు గురైతే ఆ తల్లి బాధ ఏ స్థాయిలో ఉంటుంది. అది మాటలకు అందదు. ఆ బాధ వర్ణనకు పోలదు. ఈ బాధను ఆ మాతృమూర్తి అనుభవిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా తన కొడుకును పంపించానని.. అతడి చావుకు పరోక్షంగా కారణమయ్యానంటూ విలపిస్తోంది.
పూణేలోని లోహ్ గడ్ కోట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న లోయలో పడి చనిపోయాడు. ఆ ఘటన సహజమైనదని అందరు భావించారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును విచారిస్తుంటే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘోరానికి కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా కారణమని పోలీసులు నిర్ధారించారు. దీనికి ఆమె ప్రియుడు కేతన్ సహకరించాడని.. వారిద్దరు కలిసి అతడిని అంతం చేశారని పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారు.
జూన్ 18 కంటే ముందు.. జూన్ 14న లోహ్ గడ్ కోటకు సియా, కేతన్ వెళ్లారు. అప్పుడు అతడిని లోయలోకి తోసి వేసింది. అప్పుడు ఒక పొదను పట్టుకొని అతడు ప్రాణాలు కాపాడుకున్నాడు. పాము కనిపిస్తే తోసి వేశానని.. అప్పుడు సియా చెప్పింది. ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు.
ఆ తర్వాత జూన్ 18న తన పుట్టినరోజు కావడంతో సియా లోహ్ గడ్ కోటకు వెళ్దామని కేతన్ కు చెప్పింది. దానికి అతడు ఒప్పుకోలేదు. దీంతో సియా కేతన్ తల్లిని సంప్రదించింది.”అత్తయ్య ఈరోజు నా పుట్టినరోజు. కేతన్ తో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను. అతనితో కొంత సమయం గడపాలి అనుకుంటున్నాను. ఆ కోటకు వెళ్తాం. మీరు అతడిని ఒప్పించండని” కోరింది. కాబోయే కోడలు చెప్పిన మాటలు విన్న ఆమె.. కేతన్ తో మాట్లాడింది. అతడిని ఒప్పించింది. అంతేకాదు సియాను జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది.
తన కొడుకును తానే కోటకు పంపించానని.. అందువల్లే అతడు చనిపోయాడని కేతన్ మాతృమూర్తి పదే పదే బాధపడుతోంది. ఆ సంఘటన గుర్తుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఉలిక్కిపడుతోంది. తనను తానే తిట్టుకుంటున్నది. కన్నీటిపర్యంతమవుతున్నది. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కేతన్ భయపడుతుంటాడని.. ఆ విషయం తెలిసి కూడా అతడిని పంపించానని.. ఇప్పుడు అతడు లేకపోవడం.. కాబోయే భార్య చేతిలో చనిపోవడం.. గుండెను ముక్కలు చేసినట్టు ఉంటున్నదని కేతన్ తల్లి వాపోతోంది.
