Homeఎంటర్టైన్మెంట్Mahesh- Trivikram Movie: 'మహేష్ - త్రివిక్రమ్' సినిమాకి అసలు బిజినెస్ జరగడం లేదంటూ సెన్సషనల్...

Mahesh- Trivikram Movie: ‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమాకి అసలు బిజినెస్ జరగడం లేదంటూ సెన్సషనల్ కామెంట్స్ చేసిన ఆ చిత్ర నిర్మాత నాగవంశీ

Mahesh- Trivikram Movie: సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్..మార్కెట్ లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు మాములు క్రేజ్ ఉండదు..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఆశించిన స్థాయి విజయాలుగా నిలబడలేకపోయినప్పటికీ కూడా మంచి చిత్రాలుగా టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు ప్రేక్షకుల ఆధారణని దక్కించుకున్నాయి..ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి ఒక ప్రాజెక్ట్ ఇటీవలే ప్రారంభం అయ్యింది..ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా తెరకెక్కించారు మూవీ టీం..భీమ్లా నాయక్ సినిమా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..ఈ నిర్మాణం లో తెరకెక్కిన మరో సినిమా ‘స్వాతి ముత్యం’ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ విజయదశమి కానుకగా విడుదల కాబోతుంది..కాబట్టి ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు నాగవంశీ.

Mahesh- Trivikram Movie
Mahesh

ఈ సందర్భంగా ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు..ఆయన మాట్లాడుతూ ‘గతం లో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ పరంగా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది..కానీ ఈసారి మాత్రం అలా ఉండదు..కొడితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అయ్యిపోవాల్సిందే..ఇందులో ఇంతకు ముందు మీరెన్నడూ చూడని సరికొత్త మహేష్ బాబు ని చూడబోతున్నారు..అభిమానులకు కనుల పండుగలాగా ఆయన పాత్ర చిత్రీకరణ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు..ఇక ఈ సినిమాకి 300 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందని సోషల్ మీడియా లో ఒక వార్త బాగా వైరల్ అయ్యింది.

Mahesh- Trivikram Movie
Mahesh- Trivikram Movie

ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్న కి వంశి సమాధానం చెప్తూ ‘అసలు ఈ సినిమాకి బిజినెస్ ని ఇంకా మేము మొదలు పెట్టలేదు..మొదటి షెడ్యూల్ కాకుండా మేము ఎప్పుడు బిజినెస్ ని ప్రారంబించము..300 కోట్ల రూపాయిల బిజినెస్ ఈ సినిమాకి ఎందుకు జరుగుతుంది..ఇదేమన్న పాన్ ఇండియా సినిమా అనుకున్నారా’ అంటూ సెన్సషనల్ కామెంట్స్ చేసాడు నాగ వంశి..ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular