Priyanka Jawalkar: టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందం, అభినయంతో కుర్రకారు మనసును ఆకట్టుకున్న హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాతో మంచి హింట్ అందుకుంది. ఆ తర్వాత మంచిగానే అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ.. పెద్దగా ఛాన్స్లు రాలేదు.
అయితే, ఇటీవలే తిమ్మరసు, ఎస్. ఆర్ కళ్యాణ మండపటం సినిమాల్లో అవకాశం దక్కించుకుని తన నటనతో అలరించింది. ఇందులో తిమ్మరసు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ అందుకుంది. తాజాగా గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చంది ఈ బ్యూటి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చిటించిన ఈ ముద్దుగుమ్మ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ క్రమంలోనే ఆమె మనసు విప్పి చెప్పుకున్న విషయాలు ఆమె మాటల్లోనే విందాం.. టాక్సీవాలా సినిమా తర్వాత ఫలానా హీరోలతో సినిమా చేయాలి. ఇలాంటి సినిమాకు సినిమా నేను చేయలేకపోయానే అనే టెన్షన్ ఉండేది. ఈ విషయాన్ని విజయ్తో కూాడా అన్నా. అప్పుడు విజయ్ ఓ మాట అన్నాడు. ఇప్పటికీ ఆ ప్రభావం నాపై ఉంది. ఏ సినిమాకైనా కథనే హీరో. హీరోని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోకు. మంచి కథతో చేయాలని అనుకో అని చెప్పారు. ఆ మాటలు గుర్తుపెట్టునే నా వరకు వచ్చిన అవకాశాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా.. అని ప్రియాంక చెప్పింది.