Priyanka Chopra: సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇప్పటి వరకు తన కెరీర్లో దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్లోనూ అడుగుపెట్టి గ్లోబల్ స్టార్గా మారింది. తన అందం అభినయంతో అక్కడకూడా మెప్పించగలిగింది. ఈ క్రమంలోనే వరుస హిట్ చిత్రాలతో అగ్రకథానాయకిగా కొనసాగుతోంది. కాగా, కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే హాలీవుడ్ నటుడు, గాయకుడు నికో జోనాస్ను విహాహం చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయింది. అయితే, అమెరికాలో ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయాలను ఏ మాత్రం మర్చిపోలేదు ఈ ముద్దుగుమ్మ.
తాజాగా, లాజ్ ఎంజెల్స్లోని తన నివాసంలో భర్త నికో జోనాస్తో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది ప్రియాంక. భర్త కుటుంబ సబ్యులతో కలిసి లక్ష్మీదేవి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఇందులో నికో జోనాస్, ప్రియాంక సంప్రదాయ దుస్తులు ధరించి పూజలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ దంపతుల ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, నికో జోనాస్, ప్రియాంక ఫొటోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సంప్రదాయాలను అసలు మర్చిపోని ప్రియాంకను ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి వారు భారత్కు అసలైన బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.