కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కు పూన‌కాలే..!

‘యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాద‌ర‌సం లాంటి వాడు.. ఎలా వాడుకుంటే అలా త‌యారైపోతాడు’ ఇదీ.. ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు చెప్పే మాట‌. నిజానికి వాళ్లు చెప్పడమే కాదు.. తెరపై చూస్తే మనకు అర్థమైపోతుంది. నవరసాలను అద్భుతంగా పలికించగలిగే కొద్ది మంది నటుల్లో తారక్ తప్పకుండా ఉంటాడు. అలాంటి హీరోకు దమ్మున్న దర్శకుడు తగిలితే ఎలా ఉంటుందీ? త‌్వ‌ర‌లో అదే జ‌ర‌గ‌బోతోంది. కేజీఎఫ్ తో యావ‌త్ ఇండియ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌.. యంగ్ టైగ‌ర్ […]

Written By: Neelambaram, Updated On : February 11, 2021 4:54 pm
Follow us on


‘యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాద‌ర‌సం లాంటి వాడు.. ఎలా వాడుకుంటే అలా త‌యారైపోతాడు’ ఇదీ.. ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు చెప్పే మాట‌. నిజానికి వాళ్లు చెప్పడమే కాదు.. తెరపై చూస్తే మనకు అర్థమైపోతుంది. నవరసాలను అద్భుతంగా పలికించగలిగే కొద్ది మంది నటుల్లో తారక్ తప్పకుండా ఉంటాడు. అలాంటి హీరోకు దమ్మున్న దర్శకుడు తగిలితే ఎలా ఉంటుందీ? త‌్వ‌ర‌లో అదే జ‌ర‌గ‌బోతోంది. కేజీఎఫ్ తో యావ‌త్ ఇండియ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌.. యంగ్ టైగ‌ర్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఇవాళ‌ ప్రశాంత్ నీల్ గురించి తెలియని స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కేజీఎఫ్ మొద‌టి పార్టుతో సంచ‌ల‌నం రేకెత్తించిన ప్ర‌శాంత్‌.. చాప్ట‌ర్ – 2 రిలీజ్ కాకుండానే దుమ్ము లేపుతున్నాడు. ఈ సీక్వెల్ టీజ‌ర్ ఏ స్థాయిలో ప్ర‌భంజ‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. నెవ్వ‌ర్ బిఫోర్ వ్యూస్ తో ప్ర‌పంచ రికార్డులు న‌మోదు చేసింది. ఆ షూట్ కంప్లీట్ చేసుకున్న ప్ర‌శాంత్‌.. రెబ‌ల్ స్టార్ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు.

Also Reed: ప్రపంచ సినీ వేదిక మీద భారతీయ సినిమాకు నిరాశ !

కేజీఎఫ్ సినిమా మొత్తం బంగారం గనుల్లో నడవగా.. ప్రభాస్ మూవీ ‘సలార్’ బొగ్గు గనుల నేపథ్యంలో సాగనున్నట్టు సమాచారం. తెలంగాణలోని రామగుండం బొగ్గు గనుల్లో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూట్ చేయడంతో స్టోరీ లైన్ ఇదే అనే చర్చ సాగుతోంది. మ‌రి, ఎన్టీఆర్ తో ఇంకే గ‌నుల సినిమా తీస్తాడోన‌ని చ‌ర్చ న‌డుస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్లో.

Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో న‌టించ‌నున్నాడు తార‌క్‌. ఈ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ రెండు సినిమాలు పూర్త‌య్యే సరికి చాలా టైం పడుతుంది. ఈ లోగా త‌న క‌మిట్ మెంట్స్ పూర్తిచేసుకొని.. ఎన్టీఆర్ సినిమాపై కూర్చోనున్నాడు ప్ర‌శాంత్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఉప్పెన సినిమా ఫంక్ష‌న్లో డిస్క‌స్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీంతో.. ఈ సినిమా క‌న్ఫామ్ అన్న చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా మొద‌లైతే.. అంచ‌నాలు ఆకాశాన్ని తాకుతాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.