2002 లో ఈశ్వర్ చిత్రం తో కృష్ణంరాజు గారి వారసుడిగా తెలుగు సినిమాల్లో కాలు పెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు లో అగ్ర నటుడి హోదాని .ఎంజాయ్ చేస్తున్నాడు .చేసింది 20. సినిమాలే వాటిలో ఏడు సినిమాలే హిట్ అయ్యాయి కాకపొతే బాహుబలి సిరీస్ తో నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ డిమాండ్ పీక్స్ లో ఉంది . తను చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా స్కోప్ ఉన్నవే .తాజాగా .. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్ ’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు.
అదలా ఉంటే ప్రహస ప్రస్తుతంతెలుగులో అత్యధిక పారితోషకం తీసుకొంటున్న నటుడిగా మారాడు .‘బాహుబలి `మరియు ‘బాహుబలి2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్. ఆ రెండు భాగాలకు కలిపి లాభాల్లో వాటాగా 80 కోట్ల వరకూ అందుకున్నాడు. ఇక ‘సాహో’ చిత్రానికి ఎటువంటి పారితోషికం తీసుకోలేదు అని ప్రభాస్ ఆ మధ్య ఏదో వార్తల్లో చెప్పాడు. ఆ సినిమాని నిర్మించింది బంధువు లు , స్నేహితులే కాబట్టి… నిజంగానే తీసుకుని ఉండక పోవచ్చు. నిజానికి ఆ చిత్రం ప్లాప్ టాక్ తో కూడా 230 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 150 కోట్ల వరకూ వచ్చిందట ఆ చిత్రం నిర్మాతలకు సేఫ్ వెంచర్ అనే చెప్పాలి. ఇక తన తరువాతి చేయబోయే చిత్రానికి కూడా లాభాల్లో వాటా లేదా నాన్ థియేట్రికల్స్ రైట్స్ రూపంలోపారితోషకం అందుకునే అవకాశం ఉందట. ఇక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసే చిత్రానికి దాదాపు 80 కోట్ల వరకూ అందుకునే అవకాశం ఉందట.. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ తో కూడిన పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం . . .