Prabhas: ప్రభాస్ డెబ్యూ సినిమా ఆ డైరెక్టర్ తో చేయాల్సింది.. ఎలా మిస్ అయిందంటే..?

ప్రభాస్ ను పరిచయం చేస్తే ఆ సినిమా మీద ఆటోమేటిక్ గా జనాల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతోనే ఆయన సురేష్ కృష్ణ తో సినిమా చేయించాలని చూశాడు.

Written By: Gopi, Updated On : February 22, 2024 4:33 pm
Follow us on

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఇండియా లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ప్రభాస్ ఈశ్వర్ సినిమాను జయంత్ సి పరాంజి దర్శకత్వంలో చేశాడు. నిజానికైతే కృష్ణంరాజు ప్రభాస్ ని సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఇండస్ట్రీ కి పరిచయం చేయాలని ప్రయత్నించాడు. ఎందుకంటే అప్పటికే సురేష్ కృష్ణ రజనీకాంత్ తో భాష, చిరంజీవితో మాస్టర్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు.

కాబట్టి ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ ను పరిచయం చేస్తే ఆ సినిమా మీద ఆటోమేటిక్ గా జనాల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతోనే ఆయన సురేష్ కృష్ణ తో సినిమా చేయించాలని చూశాడు.కానీ సురేష్ కృష్ణ అప్పుడు కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ మొదటి సినిమాని చేయలేకపోయాడు. అయినప్పటికీ ప్రభాస్ రెండోవ సినిమాగా రాఘవేంద్ర సినిమా చేశాడు. ఇక సురేష్ కృష్ణ బిజీగా ఉండడం వల్లే జయంతి సి పరాంజి దర్శకత్వంలో ప్రభాస్ తన మొదటి సినిమాని చేయాల్సి వచ్చిందట..ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

వాళ్ల పెదనాన్న అయిన కృష్ణంరాజు ఏ ఉద్దేశ్యం తో అయితే ప్రభాస్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడో ఆయన కోరికను నెరవేరుస్తూ ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుతూ నెంబర్ వన్ హీరోగా ప్రత్యేక ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఆయన రీసెంట్ గా సలార్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

దాంతో పాటుగా ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమాలను చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు…ఇక ఇవి పూర్తి అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు…ఇక ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నాడు…