కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో మెగాస్టార్ డ్యుయల్ చేస్తున్నారు. చిరుకు సీనియర్ హీరోమిన్ త్రిష నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘స్టాలీన్’ మంచి విజయం సాధించింది. చిరుకు జోడీగా త్రిష అలరించింది. దీంతో చిరు-152 మూవీలో త్రిషకు ఆఫర్ దక్కింది. అదేవిధంగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కుర్ర హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి ఓ ఐటమ్ లో మెరవబోతుంది. ఇంతమంది అందగత్తెలకు తోడుగా మరో భామ ఈ మూవీలో నటించనుందని తెలుస్తోంది.
చిరంజీవి-152వ మూవీలో కొరటాల శివ రాంచరణ్ కోసం ఓ పవర్ ఫుల్ పాత్రను రాసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో రాంచరణ్ బీజీగా ఉండటంతో ఈ మూవీని తప్పుకున్నట్లు తెల్సింది. అయితే రాంచరణ్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ కోసం కొరటాల శివ ‘నక్సలైట్’ పాత్రను రాసుకున్నాడు. ఈ పాత్ర మహేష్ బాబు చేస్తుండటంతో ఈ పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నాడు. మహేష్ బాబును స్టూడెంట్ లీడర్ గా కొరటాల చూపించబోతున్నాడని తెల్సింది. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెల్సింది. ఇప్పటికే చిత్రబృందం పూజను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చిరు మూవీలో మహేష్ బాబు నటిస్తుండటంతో సినిమాకు మరింతగా క్రేజీ పెరిగింది. ఈ చిత్రాన్ని రాంచరణ్ మ్యాట్ని మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్లో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని కొరటాల శివ చిరంజీవి పుట్టిన రోజు కానుక విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ మూవీని మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.