Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా కోసం వేరే లెవెల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ నెల 16 న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ని భోపాల్ లో భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మహేంద్ర సింగ్ ధోని వస్తాడనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రొమోషన్స్ సంగతి పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీ లెవెల్ లో జరుగుతోంది. గడిచిన సంవత్సర కాలం లో ఈ సినిమాకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న బిజినెస్ ఏ సినిమాకు కూడా జరగలేదు అట.
రూరల్ మాస్ సినిమా అవ్వడం , పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి కోస్తాంధ్ర ప్రాంతం లో , రాయలసీమ ని మినహాయించి 81 కోట్ల రూపాయిల బిజినెస్ చేసిందని అంటున్నారు. #RRR , పుష్ప 2, ఓజీ చిత్రాలకు తప్ప, ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా జరగలేదనే చెప్పాలి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం హక్కులు ఏకంగా 31 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. రామ్ చరణ్ కి కంచుకోట లాంటి సీమ ప్రాంతం లో ఆ మాత్రం జరగకపోతే ఎలా అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక నైజాం ప్రాంతం హక్కులు అయితే దాదాపుగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 172 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది అన్నమాట. అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల బిజినెస్ జరగ్గా, కర్ణాటక ప్రాంతం నుండి 12 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఓవరాల్ గా 224 కోట్ల రూపాయిల బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి మాత్రమే జరిగింది. హిందీ వెర్షన్ మరో 50 కోట్లు , ఇతర వెర్షన్స్ కలిపి మరో 10 కోట్లు , ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ 280 కోట్ల రూపాయలకు జరిగిందని , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ పొందాలంటే కచ్చితంగా ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి.