Gaddar Daughter Vennela: పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కాకను రేపుతోంది. మండే ఎండాకాలంలో మరింత నిప్పులను రాజేస్తోంది.. పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రతి మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా గద్దర్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయంగా కలకలం రేపాయి.
పవన్ కళ్యాణ్ గద్దర్ బతికున్నప్పుడు ఆయనకు కారు కొనిచ్చాను అని చెప్పారు. ఆయన శరీరంలో బుల్లెట్లు దిగాయని.. తెలంగాణను ప్రేమించిన గద్దర్ విషయంలో తెలంగాణ ప్రాత నాయకులు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని పవన్ కళ్యాణ్ విమర్శించారు..”గద్దర్ గొప్ప గాయకుడు. తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి తెలంగాణ లో ఉన్న నాయకులు ఏ విధమైన గౌరవం ఇచ్చారు.. కనీసం ఆయనకు ఎటువంటి గుర్తింపు కూడా ఇవ్వలేదు కదా. ఆయనకు నేను కారు కొనిచ్చాను. ఆయన నా దగ్గరికి వచ్చేవారు. నాతో ప్రశాంతంగా మాట్లాడేవారని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గద్దర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు అన్నట్టుగా వ్యవహరించాయి. అయితే ఈ ఎపిసోడ్లో గద్దర్ కుమార్తె వెన్నెల తెరపైకి వచ్చారు. “తెలంగాణ గడ్డ.. పోరాటాల గడ్డ. పొత్తులతో తెలంగాణ రాలేదు. రాజకీయ పార్టీలతో తెలంగాణ రాలేదు. ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది. గడపగడపకు సాంస్కృతిక వైవిధ్యాన్ని తీసుకెళ్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఎంతమంది పిల్లలు తమ శరీరాలను బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అస్తిత్వ పోరాటమని” వెన్నెల వ్యాఖ్యానించారు.
“తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీర్.. ఇందులో అనుమానం లేదు. మా నాన్న కు పవన్ కళ్యాణ్ అభిమాని. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటాల వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ తెలంగాణ గడ్డమీద తెలంగాణ ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రజలు మాత్రమే ఇక్కడ పరిపాలించాలి. పాలన సాగించాలని” వెన్నెల పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మీద పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. గద్దర్ గురించి పదేపదే మాట్లాడిన నేపథ్యంలో.. వెన్నెల స్పందించడం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కాంగ్రెస్ నాయకులతోపాటు గులాబీ పార్టీ.. ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. గద్దర్ గురించి పవన్ పదే పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన కుమార్తె కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడించుకుంటారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి ఆ స్థాయిలో మాట్లాడితే.. ఆయనకు వెన్నెల ద్వారా కౌంటర్ ఇప్పించడం సంచలనం గా మారింది. దీనిపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
View this post on Instagram
