Gabbar Singh’ re-release : గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..చరిత్రలో నిలిచిపోతుంది!

ఈ సినిమాకి సంబంధించి మూవీ యూనిట్ మొత్తం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా త్వరలోనే ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు అత్యధికంగా హాజరు అవుతారట. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్ళలో సగానికి పైగా ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో ప్రారంభించబోతున్న అన్నా క్యాంటీన్స్ కి డొనేట్ చేయబోతున్నారట.

Written By: NARESH, Updated On : August 11, 2024 7:58 pm
Follow us on

Gabbar Singh’ re-release : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎంత ఆనందం లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత 5 ఏళ్లుగా తమ అభిమాన హీరో రాజకీయంగా ఎదురుకుంటున్న ఒడిదుడుకులను చూసి ఎంతో మనస్తాపానికి గురైనప్పటికీ కూడా ఆయన్ని వదలకుండా కలిసి ప్రయాణం చేసారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ని అఖండ మెజారిటీ తో గెలిపించి అధికారం లోకి వచ్చేలా చేసారు. 2019 ఎన్నికలలో కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్న జనసేన పార్టీ ఈసారి పోటీ చేసిన అన్నీ స్థానాల్లో గెలుపొంది, ఎవరికీ సాధ్యం కానటువంటి రికార్డుని నెలకొల్పి సంచలనం సృష్టించారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పేరుకు ఉపముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో దాదాపుగా సరిసమానమైన స్థానం లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా ప్లాన్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. అందుకోసంగా పవన్ కళ్యాణ్ అభిమానుల పండుగ కోసం ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని అనేక సందర్భాలలో థియేటర్స్ లో రిలీజ్ చేశారు, కానీ గ్రాండ్ గా రీ రిలీజ్ మాత్రం ఎప్పుడూ చెయ్యలేదు. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటి నుండే ప్రారంభం అయ్యాయి. అభిమానుల ఉత్సాహానికి గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో అప్పుడే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా రీ రిలీజ్ మేనియా ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి మూవీ యూనిట్ మొత్తం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా త్వరలోనే ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు అత్యధికంగా హాజరు అవుతారట. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్ళలో సగానికి పైగా ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో ప్రారంభించబోతున్న అన్నా క్యాంటీన్స్ కి డొనేట్ చేయబోతున్నారట.

ఇది వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు రీ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్లను జనసేన పార్టీ కి డొనేషన్ గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ అధికారం లో ఉంది కాబట్టి, ఏదైనా సంక్షేమ పధకానికి తమ వంతు సాయంగా ఇస్తే బాగుంటుందని ఇలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇకపోతే రీసెంట్ గా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి చిత్రం ఆల్ టైం రికార్డు వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డుని ‘గబ్బర్ సింగ్’ కొడుతుందా లేదా అనేది చూడాలి.