Pawan Kalyan : మూడవ భార్యతో విడాకుల వార్తపై వైసీపీ మీడియా కి పగిలిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది.

Written By: NARESH, Updated On : July 5, 2023 7:48 pm
Follow us on

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గత మూడు రోజుల నుండి వైసీపీ పార్టీ కి సంబంధించిన మీడియా మూడవ భార్య అన్నా లెజినావా తో విడాకులు తీసుకున్నట్టు ఒక ప్రచారం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. నేషనల్ మీడియా కూడా ఈ వార్తలను ప్రచారం చేసింది. దీంతో అభిమానులు సైతం ఈ వార్త నిజమే అని అనుకున్నారు. అయితే కాసేపటి క్రితమే ట్విట్టర్ లో జనసేన పార్టీ నుండి ఈ దుష్ప్రచారం పై చాలా దీటైన సమాధానం వచ్చింది.

నేడు పవన్ కళ్యాణ్ తో అన్నా లెజినావా దిగిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.’ అని ఒక ప్రకటన చేసింది.

దీనికి సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా ఇతర హీరోల అభిమానులు కూడా వైసీపీ పార్టీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పి కొడుతూ ఇదేమి చిల్లర రాజకీయాలు అంటూ తిట్టిపోస్తున్నారు. చాలా సున్నితంగా జనసేన పార్టీ వాళ్ళు ఇచ్చిన ఈ కౌంటర్ కి, ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటుంది వైసీపీ మీడియా.