నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో యూత్లో ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ మూవీతో నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఇటీవల పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నిధి అగర్వాల్ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే ఉంటూ తనలోని టాలెంట్ బయటపెట్టింది. ఇంటో సరదాగా కేకులను తయారు చేసింది. ఈ కేకులను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో పంచుకుంది. కేకంటే తింటే.. నిధి హాట్ కేకులనే తినాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ హాట్ కేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నారు.