spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: నాగార్జునకు పిచ్చి పట్టింది అనుకున్న చైతన్య, అఖిల్, అమల?

Nagarjuna: నాగార్జునకు పిచ్చి పట్టింది అనుకున్న చైతన్య, అఖిల్, అమల?

Nagarjuna: సంక్రాంతి బరిలో బడా హీరోలు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఈ పండుగ కానుకగా నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబులు పోటీ పడ్డారు. ఇందులో నాగార్జున నటించిన నా సామిరంగా సినిమా కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకుంది. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా నా సామిరంగా సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను అరేంజ్ చేసింది. అందులో భాగంగా నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

కొత్త డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా గురించి నాగార్జున ఏమన్నారంటే.. ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20వ తేదీ నాన్న గారి జయంతి. ఆ రోజున అన్నపూర్ణ స్టూడియో లో నాన్నగారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఆ రోజు నా సామి రంగా సినిమాను లాంచ్ చేసామన్నారు. ఒక వైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయన్నారు. అయితే పూజా కార్యక్రమానికి వెళ్తుంటే అమల ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిందట.

అప్పటి వరకు ఈ సినిమాకు కమిట్ అయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదట. అదే సమయంలో సినిమా లాంచ్ కు వెళ్లాలి అని చెబితే.. ఇప్పుడు అవసరమా కాస్త ఆలస్యంగా వెళ్లండని చెప్పారట. లేదు ఈ సినిమాను సంక్రాంతికి లాంచ్ చేయాలి అని చెప్పగానే. అమలతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా అనే విధంగా చూశారని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో సినిమాను ఎలా విడుదల చేస్తారంటూ ఆశ్చర్యపోయారట.

ఎవరు నమ్మకపోయినా కూడా సినిమా టీమ్ మాత్రం నమ్మిందట. ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూనే అతి తక్కువ సమయంలో సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని తెలిపారు నాగార్జున. కానీ మొత్తంగా చాలా తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి మంచి సక్సెస్ అందుకోవడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version