వెబ్ సిరీస్ లోకి అడుగు పెడుతున్న నాగ్ అశ్విన్

“ఎవడే సుబ్రమణ్యం , మహానటి ‘ చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న నాగ్ అశ్విన్ ఇపుడు తన రూట్ మార్చు కొంటున్నాడు. సినిమాలను పక్కన పెట్టి వేరే దారిలోకి వెళ్ళ బోతున్నాడు. నిజానికి కరోనా సమస్య రాకపోతే ప్రభాస్ నటించే 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫై చేయడానికి కూడా అంతా సిద్దమయ్యింది. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో […]

Written By: admin, Updated On : April 7, 2020 3:36 pm
Follow us on


“ఎవడే సుబ్రమణ్యం , మహానటి ‘ చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న నాగ్ అశ్విన్ ఇపుడు తన రూట్ మార్చు కొంటున్నాడు. సినిమాలను పక్కన పెట్టి వేరే దారిలోకి వెళ్ళ బోతున్నాడు. నిజానికి కరోనా సమస్య రాకపోతే ప్రభాస్ నటించే 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫై చేయడానికి కూడా అంతా సిద్దమయ్యింది. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రీ ప్రొడక్షన్ ఆగింది. అదీగాక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 20 వ సినిమా షూటింగ్ ఊదా ఆగింది. దీంతో నవంబర్ లో ప్రారంభించాలనుకున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా వెనక్కి వెళ్ళింది. అయితే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్ ని వృథా చేయకూడదని నిశ్చయించు కొని ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాలను కుంటున్నాడు.

విన వస్తున్న దాన్ని బట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే ఈ వెబ్ సిరీస్ ని హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నాడట. 2004 లో బొమ్మలాట అనే చిత్రాన్ని, 2018 లో కేరాఫ్ కంచరపాలెం అనే చిత్రాన్ని సమర్పించిన రానా ఇపుడు వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో కూడా అడుగు పెడుతున్నాడు.