Thaman: ఒకే స్క్రీన్​పై ప్రభాస్​- మహేశ్​… థమన్ ట్వీట్​ వైరల్​!

Thaman: సాధారణంగా మన అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే సినిమాపై ఓ రేంజ్​లో అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇద్దరు స్టార్​ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారని తెలిస్తే.. ఇక వారి అభిమానులకు పండగే. ఇటీవలే కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్​లో కామన్​ అయ్యాయి. గోపాల గోపాల సినిమాలో పవన్, వెంకటేశ్​ కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత అనేక సినిమాలు మల్టీస్టార్​గా తెరకెక్కాయి. తాజాగా, మరో అప్​డేట్​ వచ్చింది. టాప్​ మ్యూజిక్ డైరెక్టర్​ థమన్​ ఓ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 10, 2021 11:26 am
Follow us on

Thaman: సాధారణంగా మన అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే సినిమాపై ఓ రేంజ్​లో అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇద్దరు స్టార్​ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారని తెలిస్తే.. ఇక వారి అభిమానులకు పండగే. ఇటీవలే కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్​లో కామన్​ అయ్యాయి. గోపాల గోపాల సినిమాలో పవన్, వెంకటేశ్​ కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత అనేక సినిమాలు మల్టీస్టార్​గా తెరకెక్కాయి. తాజాగా, మరో అప్​డేట్​ వచ్చింది. టాప్​ మ్యూజిక్ డైరెక్టర్​ థమన్​ ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాపై చేసిన ట్వీట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, ప్రభాస్​లను ఈ పోస్ట్​లో లింక్​చేస్తూ.. తమన్​ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​గా మారింది.

నిన్న రాత్రి థమన్​ ట్విట్టర్​ వేదికగా ఓ చాట్​ సెషన్​ నిర్వహించారు. అందులో భాగంగా మహేశ్​ 28వ ప్రాజెక్ట్​పై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ట్వీట్​ పెట్టారు. మరి థమన్​ ఈ ట్వీట్​ను మిస్టెక్​గా పెట్టారా.. లేక నిజంగానే ప్రభాస్​- మహేశ్​ సినిమాలో ఉన్నాడా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ట్వీట్​తో ఇద్దరు స్టార్​ హీరోలు ఒకే స్క్రీన్​పై కనిపిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ను డిలీడ్​ చేశారు థమన్​.

కాగా, ప్రస్తుతం మహేశ్​బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్​ మహేశ్ సరసన నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు, సలార్​, ఆదిపురుష్​, రాధేశ్యామ్​ చిత్రాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు.