సినిమా లోకం భలే విచిత్రంగా ఉంటుంది. సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న వారి కంటే కూడా.. సినిమాలో నటించాలి అనే ఆలోచన కూడా లేని వారి దగ్గరకే సినిమా ఛాన్స్ వెతుక్కుంటూ వెళ్తుంది. అంతెందుకు సినిమాల్లో గొప్ప పేరుప్రఖ్యాతలు సంపాదించిన అనేకమంది గొప్ప నటీనటుల్లో చాలామంది అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించిన వారే. హాస్య నటుడు పద్మనాభం ‘రేఖా అండ్ మురళీ ఆర్ట్స్’ నాటక సంస్థను స్థాపించి ‘శాంతి నివాసం’ నాటకాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి.
నిజానికి అప్పటికి పద్మనాభంకు సినిమాల్లో నటించాలి అనే ఆలోచన కూడా లేదు. అయితే, ఓ రోజు మద్రాసుకు వచ్చిన డ్రామా కాంట్రాక్టర్లకు పద్మనాభం, సినిమా స్టూడియోలు చూపిస్తూ వాహినీలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో అక్కడ ‘వెలుగు నీడలు’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలోని ‘భలే భలే మంచి రోజులులే..’ పాటను ఏయన్నార్ పై చిత్రీకరణ చేస్తున్నారు. ఆ పాటలో అప్పటి హాస్యనటుడు సారథి కూడా ఉంటారు. అయితే సారథి వరసగా టేకులు తినడంతో నిర్మాత దుక్కిపాటికి విసుగెత్తుకొచ్చింది.
ఒకపక్క సమయం దాటిపోతుంది. మరోపక్క అనవసరంగా రీల్ ఖర్చు పెరిగిపోతుంది. ఎటు చూసినా నిర్మాతకు నష్టమే కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు పద్మనాభం. ఐతే పద్మనాభం మంచి ఆర్టిస్ట్ అనే వియషం అప్పటికీ నిర్మాత దుక్కిపాటికి తెలియదు అట. కానీ ఆశ్చర్యకరంగా ఎందుకో పద్మనాభంను చూస్తూనే ‘నువ్విప్పుడు వేసుకున్న డ్రెస్ బాగుంది. వెంటనే మేకప్ చేయించుకో, నువ్వు ఆ పాత్ర చేయగలవు అనిపిస్తోంది’ అంటూ సారథి పాత్రలో పద్మనాభాన్ని తీసున్నారు నిర్మాత దుక్కిపాటి. కేవలం డ్రెస్ కామెడీగా ఉండటం చూసి ఆయన ఛాన్స్ ఇచ్చాడట.
ఆ విధంగా ‘కర్నూలు ఎక్కడ, కాకినాడ ఎక్కడ…’ అంటూ ఆరంభమయ్యే సాకీని పద్మనాభం మీద చిత్రించడం జరిగింది. పద్మనాభం కూడా సింగిల్ టేక్ లో నటించడం మొత్తానికి అలా తెలుగు సినిమాకి గొప్ప హాస్య నటుడు పరిచయం అయ్యాడు. ఆ పాటే పద్మనాభంకు గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి చలనచిత్ర హాస్యనట చక్రవర్తిగా ఆయన జీవితానికి గట్టి పునాదులు వేసింది ఆ పాట.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More