Chiranjeevi and Manchu Vishnu: ఒకప్పుడు చిరంజీవి కుటుంబం, మోహన్ బాబు కుంటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేవి. చిరంజీవి, మోహన్ బాబు అంటే ఇండస్ట్రీకి రెండు కండ్లు అనేలా ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాగా మొన్న మా ఎన్నికల్లో వీరిద్దరి మధ్య వివాదాలు బయట పడ్డాయి. ఇకపోతే ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసే చేశాయి మంచు విష్ణు వ్యాఖ్యలు. మొన్న ఆయన తిరుపతిలో మాట్లాడుతూ చిరంజీవి జగన్తో భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టికెట్ల రేట్ల మీద మాట్లాడేందుకు ఆయన వెళ్లలేదని, కేవలం ఆయన పర్సనల్ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ వాళ్లు జగన్ తో చర్చలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి భేటీపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. గత నెలలో జగన్ భేటీ అయిన సందర్భంగా తాను ఇండస్ట్రీ తరఫున మాట్లాడానని చిరంజీవి చెప్పారు. కానీ విష్ణు మాత్రం అది నిజం కాదన్నారు.
దీంతో ఈ రోజు చిరంజీవి మంచు ఫ్యామిలీని తప్ప మగతా వారందనీ తీసుకెళ్లి జగన్ను కలిసి మాట్లాడారు. ప్రభాస్, మహేశ్తో పాటు పెద్ద డైరెక్టర్లు కూడా వెళ్లారు. అంటే విష్ణు చేసిన వ్యాఖ్యలపై మౌనంగానే కౌంటర్ వేశారన్న మాట చిరంజీవి. ఇండస్ట్రీకి తానే దిక్కు అని నిరూపించుకునేందుకు స్టార్ హీరోలు, డైరెక్టర్లతో వెళ్లి సమస్యకు పరిష్కారం చూపించారు. దాంతో వారంతా కూడా చిరంజీవి వల్లే ఇదంతా జరిగిందంటూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.
అంటే ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి వెంటే ఉందని నిరూపించుకున్నారన్న మాట. ఈ రకంగా మంచు ఫ్యామిలీని ఇండస్ట్రీలో ఒంటరి చేసి పారేస్తున్నారన్న మాట. మొత్తానికి తన మీద చేసిన కామెంట్లకు మెగాస్టార్ ఈ విధంగా స్ట్రాంగ్ కౌంటర్ వేశారన్న మాట. ఇప్పుడు విష్ణు చేసిన కామెంట్లు అర్థం లేనివని చెప్పకనే చెప్పారు. మరి దీనిపై మంచు హీరోలు ఏమైనా మాట్లాడుతారో లేదో చూడాలి.