Manchu Lakshmi: బాలయ్య సినిమాలో ‘నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఎడ్వనీ” అని ఓ సాంగ్ ఉంది. సమాజంతో పని లేదు. నచ్చిన పని చేసుకుంటూ పోవడమేనని ఆ పాట అర్థం. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది మంచు లక్ష్మి. నాలుగు పదుల వయసులో మొహమాటం లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు ఇలాంటి షూట్స్ చేస్తారు. వారికి అవి ఆఫర్స్ తెచ్చిపెడతాయని భావిస్తారు. మరి మంచు లక్ష్మికి ఇలా అందాలు ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. అప్ కోర్స్ ఆమె కూడా గ్లామర్ ప్రపంచంలో ఉన్నారు. నటిగా సినిమాలు చేస్తున్నారు.

కానీ మంచు లక్ష్మి హీరోయిన్ కాదు. హీరోయిన్ కావాలని ట్రై చేశారు, కానీ కుదరలేదు. డబ్బులు ఉంటే సినిమాలు చేయొచ్చేమో కానీ స్టార్డమ్ తెచ్చుకోలేము. సొంత బ్యానర్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నాలుగైదు సినిమాల వరకు చేశారు. ఇంకా కొన్ని సినిమాలు చేస్తున్నారు. చిత్ర పరిశ్రమపై ప్రేమతోనో ప్రేక్షకులపై కోపంతోనో సినిమాలు చేస్తూనే ఉన్నారు.
అయితే గ్లామరస్ ఫోటో షూట్స్ లో మంచు లక్ష్మి హద్దులు దాటేస్తుంది. మంచు లక్ష్మి తీరు చూసి జనాలు అవాక్కవుతున్నారు. అసలు ఆమె కోరుకుంటున్న ఇమేజ్ ఏమిటీ? ఇలాంటి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. తాజా ఫోటో షూట్ లో ఆమె ట్రాన్స్పరెంట్ డ్రెస్ ధరించారు. బ్యాక్ మొత్తం చూపిస్తూ, క్లీవేజ్ షోతో హీటెక్కించారు. మంచు లక్ష్మి ఫోటో షూట్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతుంది. మంచువారమ్మాయి ఇలా తెగించిందేంటని నోరెళ్లబెడుతున్నారు.

ఇక మంచు లక్ష్మికి అందం అంటే మహా పిచ్చి. వయసు మీద పడకుండా వ్యాయామం, యోగాసనాలు చేస్తారు. మంచు లక్ష్మి యోగా ఎక్స్పర్ట్ కూడాను. ఆమె కఠినమైన యోగాసనాలు వేస్తారు. సదరు యోగా వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు. కాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి గురవుతారు. కానీ ఆమె వాటిని కేర్ చేయరు. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోను అంటారు. వారి మాటలు పట్టించుకుంటే జీవితంలో ఏమీ చేయలేమని అంటారు. మంచు లక్ష్మి సొంత బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.