Manasanamaha Movie: ఆస్కార్ బరిలో తెలుగు చిత్రం మనసానమః …

Manasanamaha Movie: ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు సినిమా నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు మనసానమః లఘు చిత్రం సెలక్ట్ అయ్యింది. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమః షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యంగ్ టాలెంట్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం మనసానమః. ఇందులో ధృషిక, శ్రీవల్లి, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గతేడాది యూట్యూబ్‏లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం… జాతీయ, అంతర్జాతీయ అవార్డులను […]

Written By: Raghava Rao Gara, Updated On : December 7, 2021 7:14 pm
Follow us on

Manasanamaha Movie: ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు సినిమా నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు మనసానమః లఘు చిత్రం సెలక్ట్ అయ్యింది. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమః షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యంగ్ టాలెంట్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం మనసానమః. ఇందులో ధృషిక, శ్రీవల్లి, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గతేడాది యూట్యూబ్‏లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం… జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. అలానే ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. ఈ మేరకు మనసానమః చిత్రానికి ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది.

Manasanamaha Movie

Also Read: రాజమౌళి కారణంగానే పవన్ ను పోటీలోకి దించుతున్నాడు !

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‏లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ టీమ్ పాల్గోన్నారు. మనసానమః సినిమా ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనసానమః చిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు. మనసానమఃకు ఇంటర్నేషనల్‏గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్‏గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం అని చెప్పారు. హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ… దీపక్ మనసానమః కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఎంటో తెలిసింది. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !