Homeఎంటర్టైన్మెంట్KBC 5 విజేత…చెడు వ్యసనాలకు బానిసై.. ఆఖరికి ఏమయ్యాడో తెలుసా..

KBC 5 విజేత…చెడు వ్యసనాలకు బానిసై.. ఆఖరికి ఏమయ్యాడో తెలుసా..

KBC Winner Sushil Kumar : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరి కొన్ని వారాలలో సూపర్ హిట్ షో కౌన్ బనేగా కరోడ్‌పతితో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అల్లరించడానికి సిద్ధంగా ఉన్నారు. సోనీ టీవీ ఇప్పటికే రాబోయే ఈ పాపులర్ షో ప్రోమోలను పంచుకోవడం ప్రారంభించింది. ఈ KBC 15 త్వరలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో, KBC 5 విజేత సుశీల్ కుమార్ యొక్క విషాద జీవిత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ షో ద్వారా బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్నాడు. కానీ సుశీల్ కుమార్ తన డబ్బును సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకుని అనతికాలంలోనే దివాళా తీశాడు. 2020లో సుశీల్ కుమార్ తన విషాద కథ గురించి చెబుతూ ఫేస్‌బుక్‌లో సందేశాన్ని పోస్ట్ చేశాడు.

KBC 5లో 5 కోట్లు గెలుచుకున్న తర్వాత తాను చాలా మంది దగ్గర మోసపోయానని సుశీల్ కుమార్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించాడు. డబ్బు గెలుచుకున్న తర్వాత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో తాను చాలా యక్టివ్ గా పాటిస్పేట్ చేసేవాడినని కానీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులచే మోసపోయానని సుశీల్ పేర్కొన్నాడు.

‘KBC తర్వాత, నేను సేవా కార్యక్రమాలు చేయాలి అనుకున్నాను. అందుకే ‘రహస్య విరాళాలకు’ బానిస అయ్యాను. ఒక నెలలో దాదాపు 50 వేల ఈవెంట్‌లు హాజరయ్యాను. దీని కారణంగా, చాలా సార్లు, వ్యక్తులు నన్ను మోసం చేసారు, ఇది నాకు విరాళాలు ఇచ్చిన తర్వాతే తెలిసింది. ఈ కారణంగా, నా భార్యతో నా సంబంధం క్రమంగా క్షీణించింది. మంచి వ్యక్తులు, తప్పుడు వ్యక్తులు మధ్య తేడాను ఎలా గుర్తించాలో నాకు తెలియదని, భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందడం లేదని ఆమె తరచుగా నాకు చెబుతూ ఉండేది. మేము తరచుగా దానివల్ల గొడవలు వేసుకుంటూ ఉండేవాళ్ళం, ”అని సుశీల్ కుమార్ రాశారు.

ఇక తాను దివాళా తీసినట్లు వార్తలు రాగానే ప్రజలు తనను ఈవెంట్లకు పిలవడం మానేశారని సుశీల్ చెప్పాడు. ” నేనెలా దివాలా తీసాను…? అనే విషయం మీకు చెబుతాను, అయితే అది కొంచెం సినిమా కథ లాగా ఉంటుంది. ఒకరోజు నేను బయటకు వెళ్ళినప్పుడు, ఒక ఆంగ్ల దినపత్రిక నుండి ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసాడు. అంతా సవ్యంగా సాగుతుండగా, అకస్మాత్తుగా అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అది నాకు చిరాకు కలిగించింది. కాబట్టి నా డబ్బు అంతా అయిపోయిందని, నాకు రెండు ఆవులు ఉన్నాయని, పాలు అమ్మి కొంత డబ్బు సంపాదించి బతుకుతున్నానని యాదృచ్ఛికంగా చెప్పాను. ఇక ఆ తర్వాత ఆ వార్త ప్రభావం ఎలా మారిందో మీ అందరికీ తెలియాలి. ఈ వార్త ప్రచారం అయిన దగ్గర నుంచి, నన్ను చుట్టుముట్టిన వారందరూ తమను తాము కార్నర్ చేశారు. నన్ను ఈవెంట్లకు పిలవడం ఆపేశారు. కానీ అప్పుడే నాకు ఏమి చేయాలనే దాని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం దొరికింది, ”అని అతను రాశాడు.

సుశీల్ ఇంకా మాట్లాడుతూ “నా వ్యాపారం యొక్క స్వభావం కారణంగా, నాకు జామియా మిలియాలో మీడియా చదువుతున్న కొంతమంది అబ్బాయిలు, ఐఐఎంసిలో చదువుతున్న వారు, వారి సీనియర్లు, జెఎన్‌యులో రీసెర్చ్ చదువుతున్న మరికొంత మందితో పరిచయం ఏర్పడింది. నాకు కొంతమంది థియేటర్ ఆర్టిస్టులు కూడా పరిచయం అయ్యారు. అయితే, ఈ విద్యార్థులు, కళాకారులు మాట్లాడేటప్పుడు నాకు అసలు ఏమీ రాదు అనే విషయం అర్థమై చాలా భయపడ్డాను. మెల్లగా, నేను ఇతర వ్యసనాలతో పాటు మద్యపానం, ధూమపానానికి బానిసయ్యాను. నేను ఢిల్లీలో ఒక వారం రోజులు గడిపినప్పుడల్లా, అక్కడ ఉన్న వారితో మద్యపానం, ధూమపానంలో మునిగి పోయేవాడిని. వారి ప్రసంగాలు నాకు ఆకర్షణీయంగా అనిపించాయి. ఆ సమయంలో మీడియాను చాలా తేలికగా తీసుకోవడం ప్రారంభించాను,” అంటూ చెప్పుకొచ్చారు.

సుశీల్ కుమార్ ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పర్యావరణవేత్తగా తన బాధ్యతలపై దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై వెళ్లాడు కానీ ఫలించలేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version