Mahesh babu:పరుశురాంకు టార్గెట్ పెట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారివారి పాట’ మూవీ టీజర్ ఆయన అభిమానులను సంతోషపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. గోవాలో మహేష్ పై ఫైట్ తోపాటు కొన్ని సీన్లను చిత్రీకరించేందుకు ఈ షెడ్యూల్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే చాలా అయిపోవాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మహేష్ బాబుకు ఈ సినిమా తర్వాత కీలకమైన కమిట్ మెంట్ల ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ […]

Written By: NARESH, Updated On : August 14, 2021 12:21 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారివారి పాట’ మూవీ టీజర్ ఆయన అభిమానులను సంతోషపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. గోవాలో మహేష్ పై ఫైట్ తోపాటు కొన్ని సీన్లను చిత్రీకరించేందుకు ఈ షెడ్యూల్ ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పటికే చాలా అయిపోవాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మహేష్ బాబుకు ఈ సినిమా తర్వాత కీలకమైన కమిట్ మెంట్ల ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ తో.. రెండోది దర్శకధీరుడు రాజమౌళి సినిమాలున్నాయి. ఈ క్రమంలోనే పరుశురాంను వేగంగా ఈ సినిమా ముగించాలని మహేష్ బాబు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.నిర్మాతలకు ఈ మేరకు 45 రోజుల డెడ్ లైన్ విధించినట్టు సమాచారం.

ఇప్పటికే త్రివిక్రమ్ తన తదుపరిచిత్రాన్ని మహేష్ బాబుతో అనౌన్స్ చేశాడు. ఈ చిత్రాన్ని కూడా ప్రారంభించాలని మహేష్ బాబు పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి మహేష్ బాబు మొత్తం షూటింగ్ లతోనే బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

‘సర్కారివారి పాట’ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. రికార్డ్ వ్యూస్ తో సినిమాకు హైప్ వచ్చింది. చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తోంది. కీర్తి సురేష్, మహేష్ బాబు కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. థమన్ మంచి పాటలు అందించాడట.. సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి తన తదుపరి చిత్రాలను పట్టాలెక్కించే పనిలో మహేష్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.