
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ భ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. అనిల్ సుంకరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జంటకు అభిమానులు కలెక్షన్ల వర్షం కురిపించారు. చాలా ఏళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి ఈ మూవీలో కీలకపాత్రలో నటించారు. ‘భారతి’ పాత్రలో విజయశాంతి కనిపించి అభిమానులను అలరించారు. ఈ మూవీ తర్వాత మహేష్ తదుపరి మూవీకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సరిలేరునీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో మూవీ ఉంటుందని భావించారు. అయితే ఈ మూవీలో ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అయితే మహేష్ బాబు తాజాగా దర్శకుడు పర్శురాం చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు పర్శురాం సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో చాలా పేర్లు విన్పిస్తున్నాయి.
మహేష్ జోడిగా ‘మహానటి’ కీర్తిసురేష్ ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మహేష్ బాబు పక్కన మరో ఇద్దరి బాలీవుడ్ ముద్దుగమ్మల పేర్లు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ మూవీలో నటించిన కియారా అడ్వానీ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. కియారా అడ్వానీ పేరు మహేష్ భార్య నమ్రత దర్శకుడికి సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్లలో ‘భరత్ అనే నేను’ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెల్సిందే. అలాగే మహేష్ జోడిగా తాజాగా సారా అలీఖాన్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ ముగ్గురిలో కియారా అడ్వానీకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే నాటికి మహేష్ హీరోయిన్ విషయంలో పూర్తి క్లారిటీ రానుంది.