Homeఎంటర్టైన్మెంట్మహేష్ సరసన బాలీవుడ్ కొత్త భామ!

మహేష్ సరసన బాలీవుడ్ కొత్త భామ!


‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. మహర్షి అనంతరం యువ దర్శకుడు అనిల్ రావిపుడికి అవకాశం ఇచ్చాడు. అప్పటికే వరుసగా నాలుగు హిట్ మూవీలతో సూపర్ సక్సెస్‌లో ఉన్న అనిల్‌.. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు మెసేజ్‌ను జోడించిన కథతో మహేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించాడు. ఇదే జోరులో మరో యువ దర్శకుడు పరశురామ్‌తో ఇంకో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు మహేష్. ‘సర్కారు వారి పాట’ అనే వెరైటీ టైటిల్ పెట్టిన ఈ సినిమాలో మహేష్ ఫస్ట్‌లుక్‌ను కృష్ణ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. మెడపై రూపాయి బొమ్మ టాటూ, చెవి పోగుతో ఉన్న మహేశ్ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు యూనిట్ కసరత్తలు చేస్తోంది. అయితే, ఈ మూవీలో మహేష్ సరసన నాయిక ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. తొలుత పూజా హెగ్గే నటిస్తుందని అన్నారు. ఆపై, కియారా అడ్వానీ పేరు వినిపించింది. ఇప్పటికే వీరిద్దరూ మహేశ్ తో నటించారు. మహర్షిలో పూజ యాక్ట్ చేయగా.. భరత్ అనే నేను చిత్రంలో కియారా హీరోయిన్‌ చేసి ఆకట్టుకుంది. దాంతో, మహేశ్ తో సెకండ్‌ టైమ్‌ రొమాన్స్‌ చేసే అవకాశం ఈ ఇద్దరిలో ఎవరికి వస్తుందో అని అంతా భావించారు. కానీ, ఈ ఇద్దరికీ ఆ చాన్స్ లేదట. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’లో సయీ ముఖర్జీ అనే బాలీవుడ్‌ కొత్త హీరోయిన్ నటించనుందట. మహేష్ సరసన ఇప్పటికే నటించిన వారికంటే కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. దాంతో, సయీని సంప్రదించినట్టు సమాచారం. ఈ యువ నటి బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. సల్మాన్‌ ఖాన్‌ సరసన దబాంగ్‌ 3లో నటించి ఈ మధ్యే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే, కొత్త కాంబినేషన్ ఉంటేమహేశ్ కు  కలిసొస్తుందని కూడా టాలీవుడ్‌ టాక్‌లో ఉంది. మరి, మరో బాలీవుడ్ నాయికను మహేష్ టాలీవుడ్‌కు పరిచయం చేస్తాడా? చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version