Gunasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలను తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నారు. ఇప్పటివరకు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో మనవాళ్ల నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులైతే మన సినిమాలకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వాళ్ళ నుంచి వచ్చే సినిమాలేవి ప్రేక్షకులను అలరించకపోవడంతో మన సినిమాల వైపే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా ఆయన పాన్ వరల్డ్ లోకే అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలిచిన ఒక్కడు మూవీ గురించి ఆ మూవీ దర్శకుడు అయిన గురుశేఖర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.
ముఖ్యంగా తను ఒక్కడు సినిమా కథని మహేష్ బాబు కోసం రాయలేదని చార్మినార్ దగ్గర చాయ్ తాగే కుర్రాడు ఎలా ఉంటాడు. అతనికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే వాటిని మాత్రమే బేస్ చేసుకొని కథను రాశానని చెప్పాడు. అలా రాయడం వల్లే ఆ కథ చాలా జెన్యూన్ గా వచ్చిందని సినిమా కథ మొత్తం అయిపోయిన తర్వాత దానికి మహేష్ బాబు అయితే బాగుంటాడని అతని దగ్గరికి వెళ్ళామని చెప్పాడు.
అందువల్లే సినిమాలో ఒక ప్యూరిటీ ఉంటుందని తన చెప్పడం విశేషం…కానీ అర్జున్, సైనికుడు సినిమాలను మాత్రం మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని రాశాను. అందువల్లే ఆ సినిమాలు ఫ్లాపులుగా మారాయి అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.
ఇక ఏది ఏమైనా కూడా కథని కథలాగ రాస్తే బాగుంటుంది. హీరోల ఇమేజ్ కోసం కథను కాంప్రమైజ్ చేయడం వాళ్ళను ఇంప్రెస్ చేయడం కోసం అందులో కొన్ని సన్నివేశాలను ఇరికించడం లాంటివి చేస్తేనే సినిమా కథకి దెబ్బ పడుతుంది అనే విషయాన్ని గుణశేఖర్ ఇన్ డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చెప్పాడు…
