Guntur Kaaram: గుంటూరు కారం విషయం లో త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతున్న మహేష్ బాబు..

ఇక రీసెంట్ గా సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాసరావు ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా త్రివిక్రమ్ పెద్ద డైరెక్టర్ అయితే కాదు మంచి రచయిత మాత్రమే అని చెప్పి త్రివిక్రమ్ కి షాక్ ఇచ్చాడు.

Written By: Gopi, Updated On : November 13, 2023 12:01 pm

Guntur Kaaram

Follow us on

Guntur Kaaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి డైరెక్టర్ గా ఆయనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఆయన డైరెక్షన్ మీద చాలామంది నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన తీసిన అతడు సినిమా 100 రోజుల్లో షూటింగ్ అయిపోవాల్సింది కానీ త్రివిక్రమ్ దాదాపు ఆ సినిమాని 400 రోజులు షూటింగ్ చేశాడు.

ఆ సినిమాలో ప్రతి షాట్ ని కూడా చెక్కుతూ రావడం జరిగింది. ఇలా ఆయనకు డైరెక్షన్ మీద అంత అవగాహన లేదు అన్నట్టుగా చాలా మంది చెబుతుంటారు.ఇక రీసెంట్ గా సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాసరావు ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా త్రివిక్రమ్ పెద్ద డైరెక్టర్ అయితే కాదు మంచి రచయిత మాత్రమే అని చెప్పి త్రివిక్రమ్ కి షాక్ ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు త్రివిక్రమ్ పైన మహేష్ బాబు కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం గుంటూరు కారం అనే సినిమాని స్టార్ట్ చేశారు.అది ఇప్పటికీ కూడా ఇంకా సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోలేదు.

సంక్రాంతి కి రిలీజ్ చేస్తామని సినిమాని అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా 30% బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమం లో ఆ మిగిలిన సినిమా షూటింగ్ ను త్రివిక్రమ్ ఎప్పుడు కంప్లీట్ చేసి, ఇంకేప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తాడు అనే విషయం మీద మహేష్ బాబుకి క్లారిటీ రాకపోవడంతో త్రివిక్రమ్ మీద చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ మాత్రం అటు పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలను చూసుకుంటూ ఇటు తను చేస్తున్న గుంటూరు కారం సినిమా మీద కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మొదటినుంచి ఇదంతా చూసుకుంటూ వస్తున్న మహేష్ బాబు చివరికి త్రివిక్రమ్ మీద అరిచినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చాలా వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ కూడా 2020వ సంవత్సరంలో అలా వైకుంఠపురంలో అనే సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత గుంటూరు కారం తో మళ్ళీ సంక్రాంతి తో వస్తున్నాడు. అలా వైకుంఠపురం లో సినిమాతో పాటు వచ్చిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి ఆ సినిమా తర్వాత ఎఫ్ త్రీ , భగవంత్ కేసరి అనే రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు మూడో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇండస్ట్రీ లో ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా ఫాస్ట్ గా సినిమాలను తీసుకుంటూ ముందుకెళ్తుంటే త్రివిక్రమ్ మాత్రం రోజురోజుకీ సినిమాని లేట్ చేస్తున్నాడు అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా త్రివిక్రమ్ పైన చాలా ఫైర్ అవుతున్నారు… ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ కూడా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి…