Mahesh Babu: హైదరాబాద్ లోని మోస్ట్ పాపులర్ థియేటర్స్ లో ఒకటి ‘AMB సినిమాస్’. హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ అవ్వడం తో , రీసెంట్ గా బెంగళూరులో డాళ్బీ స్క్రీన్స్ తో ప్రారంభించారు. అక్కడ కూడా ఈ థియేటర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రేక్షకులకు తిరుగులేని థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తూ, మహేష్ బాబు, సునీల్ నారంగ్ కలిసి నిర్మించిన ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ విభాగం పై GST ట్యాక్స్ తగ్గించింది. అయినప్పటికీ AMB సినిమాస్ అధిక GST ట్యాక్స్ ప్రేక్షకుల నుండి వసూళ్లు చేస్తుందని ఫిర్యాదు రావడంతో GSTAT ఈ థియేటర్స్ కి భారీ జరినామా విధించింది. మొత్తం మీద 1.7 కోట్ల రూపాయలకు గాను AMB సినిమాస్ తక్షణమే 35 లక్షల రూపాయిల జరినామా కట్టాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.
AMB సినిమాస్ తో పాటు మరో 5 థియేటర్స్ ఇలా అధిక GST ట్యాక్స్ ని జనాల నుండి వసూళ్లు చేస్తున్నట్టు గుర్తించిన GSTAT , ఆ థియేటర్స్ కి కూడా జరినామా విధించింది. అందులో కూకట్ పల్లి లో ఫేమస్ థియేటర్ అయినటువంటి భ్రమరాంబ సినిమాస్ కూడా ఉండడం గమనార్హం. ఈ థియేటర్ కి 11 లక్షల 80 వేలు జరినామా కట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జ్యోతి థియేటర్ కి 19 లక్షల 80 వేలు, కుమార్ థియేటర్ కి 2.5 లక్షలు , ASR సినిమాస్ కి 9.6 లక్షలు , విశ్వనాధ్ థియేటర్ కి 9 లక్షలు జరిమానా విధించారు. అంతే కాదు ఈ జరిమానా కి 18 శాతం వడ్డీ కూడా జత చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీంతో సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో కూడా AMB సినిమాస్ పై పలు ఆరోపణలు వచ్చాయి. మహేష్ బాబు ఈ ప్రాపర్టీ కి సంబంధించిన పన్నులు కట్టడం లేదని అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇప్పుడు మరోసారి అధిక GST పన్నులు వసూలు చేస్తున్నారంటూ వార్తలు రావడం తో , ఆయనపై సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. మరి దీనిపై మహేష్ బాబు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. త్వరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘AMB క్లాసిక్’ అనే మల్టీప్లెక్స్ కూడా మొదలు కానుంది. ఇలాంటి కీలక సమయంలో ఇలాంటి చిక్కుల్లో పడడం దురదృష్టకరం.
