Mahesh and Sandra couple: ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు , అలా తక్కువ అంచనా వేసిన ప్రతీసారి, ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఆ మనిషి హిస్టరీ క్రియేట్ చేసి అందరికంటే ముందుకు దూసుకెళ్లిన సందర్భాలు గతం లో మనం చాలానే చూశాము. అది రాజకీయాల్లో అయినా సరే, సినిమాల్లో అయినా సరే. అయితే రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షోలో అందరికంటే వీక్ జంట అనిపించుకుంది మహేష్ – సాండ్రా జంట. మొదటి మూడు వారాలు వీళ్లకు ఒక్క పరిస్థితి కూడా అనుకూలించలేదు, ఏ జంట కూడా వీళ్ళతో కలిసి గేమ్స్ ఆడేందుకు ముందుకు రాలేదు , ఎందుకంటే వీళ్ళు బాగా ఆడడం లేదని, వీళ్ళతో కలిసి ఆడితే మనకు కూడా మైనస్ అవుతుందనే ఉద్దేశ్యం ఉండడం వల్లే.
అలా ఒక్క పరిస్థితి కూడా అనుకూలించకపోవడం తో , ఈ జంట మూడవ వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే అదృష్టం కలిసొచ్చి మరోసారి వీళ్లకు అవకాశం కల్పిస్తూ , వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు మేకర్స్. అలా వైల్డ్ కార్డు ద్వారా లోపలకు అడుగుపెట్టిన ఈ జంట మొదట్లో పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడారు , డేంజర్ జోన్ లో రాకుండా జాగ్రత్త పడ్డారు. గత వారం లో అయితే ఈ జంట ని మ్యాన్షన్ లో ఉన్న ప్రతీ జంట అవమానించింది. ముఖ్యంగా సిద్దు – సోనియా జంట ఏ రేంజ్ లో అవమానించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీకు బాగా వీక్ గా అనిపించే జంట లో ఒకరిని కూర్చోబెట్టి కారణాలు చెప్పండి అని ప్రేమ గురు ఇచ్చిన టాస్క్ లో , ఈ సిద్దు సోనియా జంట మహేష్ – సాండ్రా లను తీవ్రంగా అవమానించారు.
మాకు మీరిద్దరూ వీక్ గానే అనిపిస్తున్నారు , ఇక్కడ రెండు కుర్చీలు పెడితే బెటర్ ఇద్దరినీ కూర్చోబెడుతాము అంటూ చెప్పుకొచ్చారు. అంత చులక భావం తో చూశారు. కానీ కట్ చేస్తే, ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్కుల్లో ఈ జంట ప్రభంజనం సృష్టించింది. ప్రతీ టాస్క్ ని అద్భుతంగా ఆడి , అత్యధిక పాయింట్స్ తో టికెట్ టు ఫినాలే సంపాదించి, గ్రాండ్ ఫినాలే కి మొదటి ఫైనలిస్ట్స్ గా నిలిచారు. ఇది సాధారమైన విషయం కాదు , ఏ జంట ని అయితే హౌస్ లో అందరూ వీక్ అని భావించారో , ఏ జంట ని అయితే అందరూ వీళ్ళు వేస్ట్ అని అవహేళన చేస్తూ వెక్కిరించారో , నేడు ఆ జంటని మొదటగా ఫినాలే లోకి అడుగుపెట్టారు. ఇది కదా విజయం అంటే , అందుకే పెద్దలు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు , అది చాలా పెద్ద తప్పు అని అంటుంటారు.