Homeఎంటర్టైన్మెంట్అల్లు వారి అబ్బాయి మల్లు వారి మనసు గెలిచాడు

అల్లు వారి అబ్బాయి మల్లు వారి మనసు గెలిచాడు


కరోనా సమయంలో తెలుగు సినీ స్టార్లు స్పందిస్తున్న తీరుపై ప్రశంసలు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఆ క్రమంలో దేవుని స్వస్థలం అయిన కేరళకు సాయం చేస్తూ బన్నీ మల్లు వుడ్ వారి మనసులు గెలుచు కొన్నాడు కేవలం తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు వారికే సాయం చేస్తే అదేమంత గొప్ప కాదు. భౌగోళికంగా ఈ మాత్రం సంబంధం లేని ప్రజల నుంచి , అదీ విద్యావంతులు అధికంగా వుండే మలబారు తీరంలో మల్లు అర్జున్ తన ఉనికి ఘనంగా చాటుకొన్నాడు.

అందరూ లాక్ డౌన్ సందర్భంగా విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ..కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా భారీగా విరాళం ఇచ్చి తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నాడు. ఆ క్రమంలో కేరళకు ఇచ్చిన 25లక్షల విరాళం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు కేరళ ప్రజలు ఎప్పటికీ మల్లు అర్జున్ కి రుణపడి ఉంటారని.చెబుతూ .. మీ సహాయన్ని మా మలబార్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.మిమ్మల్ని కలకాలం గుర్తుంచు కొంటారని తెలిపారు.నిజానికి గతంలో కూడా బన్నీ ఎన్నోసార్లు కేరళీయులకు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ మధ్య కేరళను వరదలు ముంచెత్తినపుడు కూడా మొట్టమొదటగా స్పందించి భారీగా విరాళం అందించింది మన అల్లు అర్జునే కావడం విశేషం. అవన్నీ గమనించిన కేరళ ప్రజలు విపత్తు లపై ఏమాత్రం స్పందించని మల్లూ హీరోలకు బాగానే చురకలు అంటించారు. ఆ విషయం లో సాక్షాత్తూ కేరళ టూరిజం మంత్రి మలయాళ సూపర్ స్టార్లను బహిరంగంగా విమర్శించడం జరిగింది. కూడా .. .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version