Kalki 2898 AD : యాస్కిన్ పాత్రకు కమల్ ను అనుకోలేదు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

Kalki 2898 AD కల్కి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించినట్లు ఈ సందర్భంగా అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు.

Written By: NARESH, Updated On : June 29, 2024 7:47 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD : కల్కి 2829 AD సక్సెస్ తో దేశవ్యాప్తంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగుతుంది. యువ దర్శకుడు నాగి కథ రాసుకున్న విధానానికి ఫిదా అవుతున్నారు. కల్కి రాకను, మహాభారతాన్ని, భవిష్యత్ ప్రపంచాన్ని మిళితం చేసి ఒక వినూత్న కథ సిద్ధం చేశారు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి రూపొందింది. ఇది గతంలో ఎవరూ టచ్ చేయని జోనర్. మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి సినిమా తీయవచ్చని నాగి తెలియజేశాడు. బ్యాలన్స్డ్ గా, కన్విన్సింగ్ గా మూవీ తీసి గ్రేట్ స్టోరీ టెల్లర్ అనిపించుకున్నారు. ముఖ్యంగా నాగి టేకింగ్ కి ఇండియా మొత్తం ఫిదా అవుతుంది.

కల్కి భారీ విజయం దిశగా అడుగులు వేస్తుండగా… నిర్మాత అశ్వినీ దత్ మీడియా ముందుకు వచ్చారు. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మహానటి సినిమా చూశాక నాగి ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడని నమ్మాను. నా ఇద్దరు కూతుళ్ళకు అదే చెప్పాను. అతను ఎంత పెద్ద సబ్జెక్టు చెప్పినా వద్దనకుండా ముందుకు వెళ్ళమని చెప్పాను. గత 50 ఏళ్లుగా దర్శకులు ఏమి కోరితే అది ఇచ్చాను. ఇది ఎందుకు అని ప్రశ్నించలేదు… అన్నారు.

కల్కి సినిమా చూసిన ప్రముఖులు నాగి టేకింగ్ ని పొగుడుతున్నారు. ముఖ్యంగా అమితాబ్ పాత్రను నాగి అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. కల్కి ప్రమోషనల్ ఈవెంట్లో అమితాబ్ నా కాళ్లకు నమస్కారం చేయడంతో నేను షాక్ అయ్యాను. కృష్ణుడు పాత్ర కోసం ముందు నుండి ఎవరినీ అనుకోలేదు. అందుకే ఆ పాత్ర ముఖం రివీల్ చేయలేదు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తో పాటు మిగతా పాత్రలకు ఎవరో ముందుగానే అనుకున్నాము.

యాస్మిన్ పాత్ర కోసం కూడా కమల్ హాసన్ ని ముందుగా అనుకోలేదు. ఈ చిత్రం కోసం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సలహాలు తీసుకున్నాము. ఆయన చక్కని సూచనలు చేశారు. అవి సినిమాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. కల్కి పార్ట్ 2 ఉందని ఈ సందర్భంగా అశ్వినీ దత్ కన్ఫర్మ్ చేశారు. దాదాపు 60 శాతం షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయ్యిందని వెల్లడించారు. కల్కి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించినట్లు ఈ సందర్భంగా అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు.