Jeevitha- Rajasekhar: బ్రేకింగ్: హీరో చిరంజీవి కేసులో రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష విధించిన కోర్టు!

చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుండి ఏ ఒక్క పేదవాడికి రక్తం ఉచితంగా ఇవ్వరంటూ అప్పట్లో అలిగేషన్స్ చేశారు. స్టూడియోలలో కూర్చొని డిబేట్స్ పెట్టారు. చిరంజీవి మీద రాజశేఖర్ దంపతుల వరుస ఆరోపణలు నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ వారి మీద కేసు పెట్టారు. పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు చాలా కాలంగా కోర్టులో విచారణ జరుపుకుంటుంది. తాజాగా తీర్పు వెల్లడించడమైంది.

Written By: Shiva, Updated On : July 19, 2023 11:06 am

Jeevitha- Rajasekhar

Follow us on

Jeevitha- Rajasekhar: హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితలకు జైలు శిక్ష పడింది. పరువు నష్టం దావా కేసులో ఈ మేరకు వాళ్లకు జడ్జి శిక్ష విధించారు. ఈ పరిణామం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఆరోపణలకు గాను రాజశేఖర్ దంపతులకు శిక్ష పడింది. 2011లో రాజశేఖర్, జీవిత చిరంజీవి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. సమాజ సేవ ముసుగులో చిరంజీవి వ్యాపారం చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులో జరిగేవన్నీ అక్రమాలే. అభిమానుల నుండి రక్తం సేకరించి ప్రైవేటు వ్యక్తులకు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారని విమర్శించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుండి ఏ ఒక్క పేదవాడికి రక్తం ఉచితంగా ఇవ్వరంటూ అప్పట్లో అలిగేషన్స్ చేశారు. స్టూడియోలలో కూర్చొని డిబేట్స్ పెట్టారు. చిరంజీవి మీద రాజశేఖర్ దంపతుల వరుస ఆరోపణలు నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ వారి మీద కేసు పెట్టారు. పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు చాలా కాలంగా కోర్టులో విచారణ జరుపుకుంటుంది. తాజాగా తీర్పు వెల్లడించడమైంది.

నాంపల్లి 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రెండేళ్లు జైలు శిక్ష రూ. 5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. రాజశేఖర్ దంపతులకు చెరో ఏడాది జైలు శిక్ష విధించారు. అయితే అపరాధ రుసుము చెల్లించడంతో జిల్లా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి పై కోర్టులో రాజశేఖర్, జీవిత ఈ కేసుపై పోరాటం చేయనున్నారు అప్పట్లో రాజశేఖర్ దంపతులు పనిగట్టుకొని చిరంజీవిని టార్గెట్ చేశారు.

చిరంజీవితో వీరు విభేదించడానికి పలు కారణాలు ఉన్నట్లు సమాచారం. చిరంజీవి-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ బ్లాక్ బస్టర్. అది తమిళ చిత్రం రమణ కి రీమేక్. రమణ రీమేక్ హక్కులు జీవిత రాజశేఖర్ దంపతులు కొనాలని నిర్ణయించుకున్నారట. చిరంజీవి మధ్యలో ఎంటరై రమణ హక్కులు చేజిక్కించుకుని రాజశేఖర్ చేయాల్సిన మూవీ ఆయన చేశారట. ఈ కారణంగానే చిరంజీవి మీద రాజశేఖర్, జీవిత కోపం పెంచుకున్నారనే వాదన ఉంది. ఇక జీవిత రాజశేఖర్ పై పలు వివాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.