Allu Arjun: కొత్తింట్లోకి అల్లు అర్జున్, ఇక అన్నీ అక్కడి నుంచే… విలాసవంతమైన ఈ భవనం ప్రత్యేకతలు ఇవే!

అల్లు అర్జున్ కొత్త భవనాన్ని సుమారు 3000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఆధునిక హంగులతో విశాలంగా ఈ ఇంటి నిర్మాణం చేపట్టాడట. జిమ్, లైబ్రరీ, గార్డెన్, స్వమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్ వంటి సౌకర్యాలు కొత్తింట్లో ఉండేలా చూసుకుంటున్నారట.

Written By: S Reddy, Updated On : August 26, 2024 5:39 pm

Allu Arjun(3)

Follow us on

Allu Arjun: ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త్వరగా పూర్తి చేసి అనుకున్న తేదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తీరిక లేకుండా కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బన్నీ తన ఆఫీస్ ను వేరే చోటికి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇకపై అక్కడ నుంచే అన్ని పనులు చేయనున్నారట. ఆయన జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ఏరియాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్త ఇంట్లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అని సమాచారం. ఇకపై అల్లు అర్జున్ అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు చక్కబెడతాడట.

అల్లు అర్జున్ కొత్త భవనాన్ని సుమారు 3000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఆధునిక హంగులతో విశాలంగా ఈ ఇంటి నిర్మాణం చేపట్టాడట. జిమ్, లైబ్రరీ, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్ వంటి సౌకర్యాలు కొత్తింట్లో ఉండేలా చూసుకుంటున్నారట. ముంబై కి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్ ని రంగంలోకి దించాడట. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి తమ అభిరుచికి తగ్గట్లు ఇంటిని డిజైన్ చేయించారట. ఇప్పటికే 60 శాతం నిర్మాణం పూర్తయిందట. నిర్మాణం కంప్లీట్ అయ్యాక కొత్తింటికి అల్లు అర్జున్ ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారట. అల్లు అర్జున్ కొత్తింటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట.

ఈ కొత్త భవనం దివంగత నటుడు కృష్ణం రాజు ఇంటికి దగ్గరలో ఉందట. మైత్రి మూవీస్ ఆఫీస్ కూడా బన్నీ కొత్త ఇంటికి పక్కనే ఉందట. తన బ్రాండ్ వాల్యూ అల్లు అర్జున్ ఈ విధంగా మరింత పెంచుకున్నాడని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇది ఇలా ఉంటే .. అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య కోల్డ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ – మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ధూషించుకుంటున్నారు.

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారిస్తుంది. ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యాను అని అల్లు అర్జున్ అన్న మాటను పట్టుకుని బన్నీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా పుష్ప 2 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.