Guntur Kaaram: గుంటూరు కారం ఆ హీరో రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు దగ్గరికి వచ్చిందా..?

బిజీగా ఉండడం వల్ల ఆ కథని మహేష్ కి చెప్పి ఒప్పించి ఆయనతో సినిమా చేశాడు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ ని చాలా రోజుల నుంచి దూరం పెడుతూ వస్తున్నాడు. ఎందుకంటే తనకి ఖలేజా లాంటి ప్లాప్ ఇచ్చిన తర్వాత మహేష్ అతని గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు.

Written By: Gopi, Updated On : January 13, 2024 8:44 am

Guntur Kaaram

Follow us on

Guntur Kaaram: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరోతో చేసి కొంత మంది డైరెక్టర్లు సక్సెస్ లు కొడుతుంటే మరి కొంత మంది ఆ సినిమాని వేరే హీరోలతో చేసి ఫెయిల్యూర్ గా మిగిలుస్తున్నారు. ఇక ఈరోజు రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా పరిస్థితి కూడా అలాగే మారింది. నిజానికి త్రివిక్రమ్ ఈ సినిమాని మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు.

కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల ఆ కథని మహేష్ కి చెప్పి ఒప్పించి ఆయనతో సినిమా చేశాడు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ ని చాలా రోజుల నుంచి దూరం పెడుతూ వస్తున్నాడు. ఎందుకంటే తనకి ఖలేజా లాంటి ప్లాప్ ఇచ్చిన తర్వాత మహేష్ అతని గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు.

ఇక దాంతో అలా వైకుంఠపురం లో సినిమాతో ఒక సక్సెస్ ని సాధించిన త్రివిక్రమ్ తో మరొకసారి సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ ని చూపించాడు. దాంతో అతను మహేష్ బాబు కి కథ చెప్పి అతని చేట గుంటూరు కారం సినిమా చేశాడు.ఇక ఇప్పుడు ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక దానికి మహేష్ అభిమానులు ఎన్టీఆర్ చేయాల్సిన స్టోరీ ని మా హీరో తో చేయించి మా హీరో కి ఒక ప్లాప్ ఇచ్చావ్ అంటు ఆయన మీద ఫెయిర్ అవుతున్నారు. ఇక దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మా హీరో ఒక ప్లాప్ నుంచి తప్పించుకున్నాడు అంటు సంబర పడుతున్నారు.

మొత్తానికైతే త్రివిక్రమ్ ఒక హీరోతో చేయాల్సిన సినిమాని మరొక హీరోతో చేసి ఒక హీరోకి ఇవ్వాల్సిన ప్లాప్ ని మరొక హీరోకి ఇచ్చేశాడు. ఇక ఈ విషయం లో అయితే మహేష్ బాబు అభిమానులకు త్రివిక్రమ్ మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి సినిమాని చూస్తే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు త్రివిక్రమ్ చెప్పిన మాటలు నమ్మి ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు కానీ ఈ సినిమాలో అంత మ్యాటర్ లేకపోవడంతో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు అయిన మీదా చాలా కోపానికి వస్తున్నారు…