మళ్ళీ తెలుగులో నటిస్తాను అంటున్న ఉపేంద్ర

కన్యాదానం , ఒకే మాట, నీతోనే ఉంటాను చిత్రాల తరవాత చాల గ్యాప్ తీసుకొని 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో స్పెషల్ పాత్రలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగులో నటించాలని ఉంది అంటున్నాడట …నిజానికి ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా ఉపేంద్రకి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది . అయితే ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. కాగా ఈ మధ్య జరిగిన […]

Written By: admin, Updated On : April 26, 2020 8:05 pm
Follow us on


కన్యాదానం , ఒకే మాట, నీతోనే ఉంటాను చిత్రాల తరవాత చాల గ్యాప్ తీసుకొని 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో స్పెషల్ పాత్రలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగులో నటించాలని ఉంది అంటున్నాడట …నిజానికి ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా ఉపేంద్రకి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది . అయితే ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.

కాగా ఈ మధ్య జరిగిన మీడియా ఇంటర్వ్యూ లో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగు లో నటించక పోవడానికి కారణం కన్నడలో బిజీగా ఉండటమే అని చెప్పడం జరిగింది .అదీగాక . సినిమాలతో పాటు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నాను. అన్నాడు .

ప్రస్తుతం ఉపేంద్ర , మెగా హీరో వరుణ్ తేజ్ కధానాయకుడిగా నటిస్తున్న ‘బాక్సర్’ అనే చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు . ఇదిలా ఉండగా ఉపేంద్ర సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర నటించబోతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘కబ్జా’ పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మాణ మౌతోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ సమర్పణలో చంద్రశేఖర్ నిర్మిస్తుండగా ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు – తమిళం – కన్నడ – మలయాళం – ఒరియా – మరాఠీ భాషల్లో పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న అండర్ వరల్డ్ చిత్రమిది. ఈ లెక్కన తెలుగులో పాగా వేయడానికి ఉపేంద్ర గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అని తేలుతోంది .