Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు ఖరీదు అన్ని కోట్లా? గ్లోబల్ స్టార్ అంటే ఆ రేంజ్ ఉంటది!

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. జులై 12న పెళ్లి వేడుక. రేపు రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ పెళ్ళిలో సందడి చేయనున్నారు.

Written By: S Reddy, Updated On : July 11, 2024 8:55 pm

Ram Charan's new car Rolls Royce Specter Electric model

Follow us on

Ram Charan : రామ్ చరణ్ దంపతులకు అనంత్ అంబానీ పెళ్ళికి ప్రత్యేక ఆహ్వానం దక్కింది. ఈ క్రమంలో నేడు వారు ముంబై పయనమయ్యారు. ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లేందుకు బేగంపోర్ట్ విమానాశ్రయానికి వచ్చారు. కాగా రామ్ చరణ్, ఉపాసన వచ్చిన కారు అందరినీ ఆకర్షించింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరో. వేల కోట్లకు అధిపతి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన భర్తకు మించిన సంపద కలిగి ఉంది. అపోలో గ్రూప్ వైస్ చైర్పర్సన్ అయిన ఉపాసన వాటా విలువ రూ. 10 వేల కోట్లకు పైమాటే అని ఓ అంచనా..

రామ్ చరణ్ కుటుంబానికి చార్టెడ్ ఫ్లైట్ ఉంది. ఎక్కడికి వెళ్లాలన్నా సొంత విమానంలో చెక్కేస్తారు. అలాగే రామ్ చరణ్ వద్ద రేంజ్ రోవర్, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఫెరారీ పోర్టోఫినో , మెర్సిడెస్ మాపాగర్ GLS 600 వంటి అరుదైన లగ్జరీ కార్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కో కారు విలువ కోట్లలో ఉంటుంది. తాజాగా రామ్ చరణ్ మరో కాస్ట్లీ కారు కొన్నారని సమాచారం. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఆయన సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్ గా రోల్స్ రాయిస్ ఉంది. రోల్స్ రాయిస్ కార్లు అతికొద్ది మంది హీరోలు మాత్రమే కలిగి ఉన్నారు.

రామ్ చరణ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ మోడల్ అని సమాచారం. ఇక ఈ కారు ధర అక్షరాల రూ. 7.5 కోట్లు అట. రామ్ చరణ్ కొత్త కారు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రామ్ చరణ్ దంపతులకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గత కొద్ది రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. జులై 12న పెళ్లి వేడుక. రేపు రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ పెళ్ళిలో సందడి చేయనున్నారు. కూతురు క్లిన్ కారతో పాటు ముంబై కి పయనమైన రామ్ చరణ్ దంపతులను మీడియా తమ కెమెరాల్లో బంధించారు.

మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఆయన పార్ట్ కంప్లీట్ అయ్యిందట. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. తండ్రి-కొడుకుల పాత్రల్లో రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఒక పాత్రలో ఐఏఎస్ అధికారికంగా మరొక పాత్రలో రాజకీయ నాయకుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో రామ్ చరణ్ ఆకట్టుకోనున్నారు.

రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అంజలి మరొక హీరోయిన్. సునీల్, శ్రీకాంత్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీకి సైన్ చేశాడు. రామ్ చరణ్ 16వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. రామ్ చరణ్ రోల్ మాస్ గా ఉంటుందని సమాచారం. విలేజ్ రివేంజ్ డ్రామా అంటున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.