Hero nithin: గురువుకు పోటీగా సినిమా విడుదలకు సిద్ధమైన శిష్యుడు!

Hero nithin: ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకుండా.. కష్టపడి పైకి ఎదిగిన వారిలో హీరో నితిన్​ ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి కథ భిన్నంగా ఎంచుకుంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే, ఈ మధ్య వరుసగా పెద్దగా హిట్టు టాక్​ దక్కించుకోలేకపోయారు నితిన్​. ఇటీవల వచ్చిన చెక్​ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పాటు రంగ్​దే, మాస్ట్రో చిత్రాలు ఆవరేజ్​ టాక్​తో నిలిచాయి. కాగా, […]

Written By: Raghava Rao Gara, Updated On : November 13, 2021 11:22 am
Follow us on

Hero nithin: ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకుండా.. కష్టపడి పైకి ఎదిగిన వారిలో హీరో నితిన్​ ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి కథ భిన్నంగా ఎంచుకుంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే, ఈ మధ్య వరుసగా పెద్దగా హిట్టు టాక్​ దక్కించుకోలేకపోయారు నితిన్​. ఇటీవల వచ్చిన చెక్​ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పాటు రంగ్​దే, మాస్ట్రో చిత్రాలు ఆవరేజ్​ టాక్​తో నిలిచాయి. కాగా, ప్రస్తుతం తన సొంత బ్యానర్​లో తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఎప్రిల్​ 29న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

అయితే, విచిత్రం ఏంటంటే.. అదే రోజు పవన్​ కళ్యాణ్​ ప్రధాన పాత్రలో క్రిష్​ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదల కానుంది. తెలుగు సినీ పరిశ్రమలో నిత్​ పవన్​కు ఎంత వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో పవన్​ సినిమాకు విజిల్ వేసే స్థాయి నుంచి.. తన సినిమాకు పవన్ స్పెషల్​ గెస్ట్​గా వచ్చే స్థాయికి ఎదిగారు నితిన్​. ఈ క్రమంలోనే వీరిద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడంపై ప్రస్తుతం అటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, నట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి.

కాగా, ప్రస్తుతం పవన్​ నటిస్తున్న భీమ్లానాయక్​ సినిమా.. దాదాపు షూటింగ్​ కంప్లీట్​ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా బరిలోకి దిగనుంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై వేరే లెవెల్​ అంచనాలు క్రియేట్​ చేశాయి.