Major: ముంబయిలో హీరో అడవి శేష్​.. మేజర్​ ఉన్నికృష్ణన్​కు నివాళి

Major: అడవి శేషు హీరోగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్​. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు భాషల్లో రూపొందించిన ఈ సినిమా.. 120 రోజుల పాటు షూటింగ్ జరిగింది. సుమారు 75 లొకేషన్లలో షూటింగ్​ జరపగా.. అందులో 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు.  26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరవీరుడైన సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవితంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా, […]

Written By: Raghava Rao Gara, Updated On : November 26, 2021 12:48 pm
Follow us on

Major: అడవి శేషు హీరోగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్​. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు భాషల్లో రూపొందించిన ఈ సినిమా.. 120 రోజుల పాటు షూటింగ్ జరిగింది. సుమారు 75 లొకేషన్లలో షూటింగ్​ జరపగా.. అందులో 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు.  26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరవీరుడైన సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవితంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా, ఉన్నికృష్ణన్​ త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఆయన తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఈ రోజు సందీప్​ ఉన్నికృష్ణన్​ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. తాజ్​మహల్​ ప్యాలెస్​ను సందర్శించడానికి ముంబయి వస్తుంటారు. ఈ క్రమంలోనే షూటింగ్​ సమయంలో హీరో అడవి శేషుకు, మేజర్​ సందీప్​ కుటుంబానికి లోతైన బంధం ఏర్పడింది. సామాన్య ప్రజలకోసం తన ప్రాణాలను కోల్పోయిన భరతమాట ముద్దుబిడ్డను స్మరించుకుంటూ.. మేజర్​కు నివాళులు అర్పించేందుకు తాజాగా, అడవిశేషు ముంబయి చేరుకున్నారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 11న  ఈ సినిమా విడుదల కానుంది.

తన కెరీర్​లో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు అడవి శేషు. ఈ సినిమాలో కూడా తన నటనతో శక్తినంతా ధారపోస్తున్నట్లు తెలుస్తోంది.