Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu movie issue: బయ్యర్స్ తో 'హరి హర వీరమల్లు' నిర్మాత...

Hari Hara Veera Mallu movie issue: బయ్యర్స్ తో ‘హరి హర వీరమల్లు’ నిర్మాత గేమ్స్..పవన్ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్!

Hari Hara Veera Mallu movie issue: హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu)..ఈ సినిమా మొదలైనప్పుడు అల్లు అర్జున్(Icon star Allu Arjun) పుష్ప పార్ట్ 1 షూటింగ్ జరుగుతూ ఉండేది. #RRR మూవీ షూటింగ్ అప్పుడే మొదలై రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. మూడు కరోనాలు వచ్చి వెళ్లిపోయాయి, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు సంవత్సరాలు సినిమా ఆలస్యం అయ్యింది. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘అంజి’ చిత్రానికి ఎక్కువ సంవత్సరాలు ఆలస్యమైన సినిమాల క్యాటగిరీ లో ఉండేది. అప్పట్లో ఈ చిత్రం మూడేళ్లు ఆలస్యం అయ్యింది. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ ఏకంగా ఆరేళ్ళు. ఇంత ఆలస్యమైన సినిమాకు మార్కెట్ లో క్రేజ్ ఉండకపోవడం సహజమే. అలాంటిది ఇలాంటి సినిమాకు నిర్మాత పుష్ప 2 , ఓజీ రేంజ్ బిజినెస్ జరగాలని ఆశించడం ఏమైనా సమంజసమా మీరే చెప్పండి?..కానీ మన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం ఆ రేంజ్ బిజినెస్ ని కోరుకుంటున్నాడు.

Also Read: విజయ్ దేవరకొండ కి బ్రదర్ సెంటిమెంట్ కలిసి వస్తుందా..?

మార్కెట్ లో పాత బడిన వస్తువుల వైపు మనం కన్నెత్తి అయినా చూస్తామా?, అలాంటిది వందల కోట్ల వ్యాపారాన్ని ఒక పాతబడిన సినిమాకు ఎలా ఆశిస్తావు అని అభిమానులు నిర్మాత AM రత్నం ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే నిర్మాత AM రత్నం కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండే 180 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఈ సినిమాకు ఆశిస్తున్నాడు. బయ్యర్స్ 120 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ రత్నం అసలు క్రిందకు దిగి రావడం లేదు. ఇంత మొండిపట్టుదలతో ఉండే నిర్మాతని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా చూసుండము. ఆయన ఎలాంటి వాడంటే నైజాం ప్రాంతం లో ఈ చిత్రాన్ని 40 నుండి 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి దిల్ రాజు,మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

Also Read: రష్మికకు భారీ షాక్… సమంత అంత తోపా?

కానీ రత్నం ఆ రేట్ కి అమ్మడానికి అసలు ఇష్టపడలేదు. దీంతో ఆయన క్రౌన్ మూవీస్ ద్వారా తన సినిమాని సొంతంగా విడుదల చేసుకునేందుకు సిద్దమయ్యాడు. పోనిలే ఎదో ఒకటి అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆ డీల్ కూడా రద్దు అయ్యింది. అదే విధంగా సీడెడ్ లో 23 కోట్ల రూపాయలకు దీప ఆర్ట్స్ అనే సంస్థకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో సీడెడ్ బిజినెస్ కూడా ఇప్పుడు హోల్డ్ లో పడింది. నెల్లూరు, వైజాగ్ , గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. విడుదలకు 5 రోజుల సమయం లో కూడా ఇంకా బయ్యర్స్ ఖరారు కాలేదంటే నిర్మాత ఈ సినిమాను ఎంత నాశనం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న తేదికి విడుదల అవుతుందా అనే సందేహం ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular