Yadagirigutta Board Controversy: మెగాస్టార్ చిరంజీవి కి ప్రస్తుతం రాజకీయాలతో ఎలాంటి ప్రత్యక్ష , పరోక్ష సంబంధాలు లేవు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత , ఒక 5 ఏళ్ళు యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉన్నారు , కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాలకు టాటా చెప్పి , సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి , వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యినప్పటికీ, జనసేన పార్టీ ద్వారా రాజ్యసభ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు. చిరంజీవే రాజకీయాల్లో లేనప్పుడు , ఇక ఆయన సతీమణి సురేఖ కొణిదెల ని రాజకీయ రొచ్చు లోకి లాగి , పెద్ద వివాదం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ‘యాదగిరిగుట్ట’ బోర్డు మెంబర్ల జాబితా ని నిన్న విడుదల చేసింది. ఈ జాబితా లో చిరంజీవి సతీమణి సురేఖ పేరు కూడా ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. కొంతమంది ప్రముఖులు తెలంగాణలోని విశిష్టమైన ఆలయానికి బోర్డు మెంబెర్స్ గా పెట్టడానికి తెలంగాణ వాళ్ళు ఎవ్వరూ దొరకలేదా , ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళను పెట్టడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి?, ఏ అర్హత ఉందని సురేఖకు ఆ పదవి ని అప్పగించారు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్స్. దీనికి చిరంజీవి ఫ్యాన్స్ నెటిజెన్స్ చాలా ధీటుగా కౌంటర్లు ఇచ్చారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా?, అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏంటి? అంటూ విరుచుకుపడుతున్నారు. సురేఖ గారిని బోర్డు మెంబెర్ గా చేర్చడానికి అనేక కారణాలు ఉన్నాయని, ప్రభుత్వం అంత తేలికగా ఎవరినీ నియమించదు అనే విషయాన్ని గమనించాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది అయితే చిరంజీవి కి , సీఎం రేవంత్ రెడ్డి కి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉండడం వల్లే, చిరంజీవి సిఫార్సు కారణంగా సురేఖకు బోర్డు మెంబెర్ గా చోటు దక్కిందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని సురేఖ పేరు , ఈ ఒక్క కారణం చేత నిన్నటి నుండి సోషల్ మీడియా , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో చాలా గట్టిగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ముదురుతుందా ?, లేదా చల్లారుతుందా అనేది చూడాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ అంశంపై సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. కనీసం ఆయన సీఎం రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు కూడా తెలపకపోవడం గమనార్హం.
