Roja: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మన టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ , ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె అసలు పేరు లతా రెడ్డి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రొజాగా మార్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ‘ప్రేమ తపస్సు ‘ అనే చిత్రం ద్వారా మన వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి బడా సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రోజా. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఈమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది.
ముందుగా తెలుగు దేశం పార్టీ లో చాలా ఏళ్ళు కొనసాగింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చింది , రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీ లోకి చేరింది. మూడు సార్లు వైసీపీ పార్టీ నుండి నగరి నియోజకవర్గం నుండి పోటీ చెయ్యగా, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యింది. 2019 – 2024 వైసీపీ పాలనలో మంత్రి కూడా అయ్యింది. ఇలా రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలను చూసిన రోజా , ఇప్పటికీ రాజకీయాల్లో యాక్టీవ్ గానే కొనసాగవుతుంది. మధ్యలో కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు తనకు ఎదురైనా అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
తనకు సినీ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేదని, కానీ ఏ హీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చింది రోజా. అందుకు కారణం కెరీర్ ప్రారంభం లోనే ఈమె ప్రముఖ డైరెక్టర్ సెల్వమణి దృష్టిలో పడడం వల్లే అట. రోజా ని చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట సెల్వమణి , అప్పటి నుండి ఆయన రోజా పట్ల స్పెషల్ కేర్ చూపించడం మొదలు పెట్టాడట, హీరోలకు సెల్వమణి తనని ప్రేమిస్తున్నాడనే విషయం అర్థం అవ్వడం వల్ల, ఎవ్వరూ తనకు లవ్ ప్రపోజల్స్ పెట్టలేదని, ఒక రోజు సెల్వమణి వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడని , కొన్ని రోజులు అతనితో ట్రావెల్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పించానని చెప్పుకొచ్చింది రోజా.
