Prasanth Varma Career Downfall: హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆ సినిమా తర్వాత మరొక సినిమా అయితే రిలీజ్ చేయలేదు. ఈ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఆయన మరొక సినిమానైతే స్టార్ట్ చేయలేదు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టినటించబోతున్నాడు అంటూ ఒక పోస్టు చేశారు. అయినప్పటికి ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించిన ఏ వివరాలు కూడా బయటికి రావడం లేదు. ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం సినిమా ఆగిపోయిందని చెబుతుండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ కి భారీ గుర్తింపు వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆయన తన టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికైన ఆయన మీద పూర్తి ఫోకస్ ని పెట్టి సినిమా చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ తో సింబా అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు.
ఆయన ఎందుకని ఇలా చేస్తున్నాడు అవకాశాలు వస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ప్రొడక్షన్ వైపు వెళ్తున్నాడు. ఆయనకు దర్శకుడిగా చేసే ఇంట్రెస్ట్ లేదేమో అనే ఉద్దేశ్యంతో స్టార్ హీరోలు సైతం అతన్ని పట్టించుకోవడం లేదు. గతంలో ప్రభాస్ ను కలిసి ఒక కథను వినిపించానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ సినిమా విషయంలో కూడా ఎలాంటి క్లారిటిని చూపించలేకపోతున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. కానీ అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే రన్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక దాంతో ప్రశాంత్ వర్మ డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి మరొక సినిమా రాకపోవడంతో అతని అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అంటు అతని మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నాడు…