Prabhas story selection process: ‘ఈశ్వర్’ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన నటుడు ప్రభాస్… మొదటి సినిమాతోనే నటుడిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా వర్షం సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. తన లాంటి హీరో మరొకరు ఉండరు అనేంతలా పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. బాహుబలి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో విభిన్న తరహా సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తను చేసే సినిమా కథలను ఆయన సెలెక్ట్ చేసుకోవడం లేదట. ఆయన ఒకసారి కథను విని దాన్ని ఫైనల్ చేసే బాధ్యతను వంశీ ప్రమోద్ ల పైన పెడుతున్నట్టుగా తెలుస్తుంది. వంశీ ప్రమోద్ లు ఇద్దరు కూడా ప్రభాస్ కి కజిన్ బ్రదర్స్ అవుతారు. మూవీ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించింది కూడా ప్రభాసే కావడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఆయన నుంచి ఈ సంవత్సరం వచ్చిన రాజాసాబ్ సినిమా కొంతవరకు నిరాశపరిచింది. అంతకుముందు చేసిన కల్కి, సలార్ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించడంతో ఆయన టాప్ రేంజ్ కి వెళ్ళిపోయాడు.
ఇక ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో కూడా మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం తనను మించిన నటుడు మరొకరు ఉండరనేది చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…
