Peddi First Day Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రేంజ్ లో ఒక స్టార్ హీరో సినిమాకు పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ రావడం అనేది గడిచిన 5 ఏళ్లలో ఎవరికీ కూడా జరగలేదు. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాస్టింగ్ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలు ఈ చిత్రానికి 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ఒక పోస్టర్ ని విడుదల చేశారు కానీ , అంత గ్రాస్ రాలేదని , కేవలం 110 నుండి 115 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చిందో , ఈ చిత్రానికి సెన్సేషనల్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. ఆ కారణం చేత ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 18 కోట్ల 20 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే సీడెడ్ ప్రాంతం నుండి 7 కోట్ల 70 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 7 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 6 కోట్ల 50 లక్షలు , తూర్పు గోదావరి నుండి 5 కోట్ల 15 లక్షలు , పశ్చిమ గోదావరి నుండి 3 కోట్ల 85 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 70 లక్షలు , నెల్లూరు నుండి 2 కోట్ల 22 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 75 లక్షలు , ఓవర్సీస్ నుండి 11 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 70 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రమే , హిందీ మరియు ఇతర బాషల నుండి ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
