Krithi Shetty: సినీ సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే , వాళ్ళకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది కొంతమంది ఎందుకు గ్రహించారో అర్థం కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా?, ఏ మూడ్ లో ఉన్నారు?, ఎలా ప్రవర్తించాలి వంటివి ఏమి ఉండవు, వాళ్ళు కనిపించగానే మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయాలి , ఒకవేళ ఇవ్వకపోతే వాళ్లపై నెగెటివ్ కథనాలు ప్రచారం చేయడం , ఇవే జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోగ్రాఫర్స్ నుండి తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ లిస్ట్ లో చేరిపోయింది. రీసెంట్ గా ఈమె షూటింగ్ ని ముగించుకొని వస్తున్న సమయం లో విమానాశ్రయం లో చేదు అనుభవం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
విమానాశ్రయం లో దిగి కారు ఎక్కుతున్న సమయం లో కృతి శెట్టి ని ఫోటో గ్రాఫర్స్ చుట్టుముట్టి ఫోటోలు తీశారు. వాళ్ళ కోసం ఆమె ఆగి ఫోటోలు కూడా దిగింది. తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె బ్యాక్ వైపు కూడా ఫోటోలు తీశారు. అందుకు ఆమె ఇబ్బంది పడుతూ వద్దు అని చెప్పింది. అయినప్పటికీ వినకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. చివరికి చిరాకు పడి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫోటో గ్రాఫర్స్ తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇలా సినీ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని , వాళ్ళు ఒక్కసారి నో చెప్తే అర్థం చేసుకోవాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇక కృతి శెట్టి విషయానికి వస్తే , ఈమధ్య కాలం లో ఈమె చేసే ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర బలంగా పడింది. ఇప్పుడు ఈమె వెంకటేష్ , అనిల్ రావిపూడి , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న క్రేజీ మూవీ లో ఒక హీరోయిన్ గా నటించబోతుంది. వరుస హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి , కృతి శెట్టి కి హిట్ ఇస్తాడా లేదా ఆయనే కృతి శెట్టి కారణంగా డిజాస్టర్ ని అందుకుంటాడా అనేది చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
