జనసేనలోకి మళ్లీ జేడీ.. పక్కా హామీ ఇస్తేనేనట..!

రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎవరు ఏ పార్టీల్లో ఉంటారో.. ఏ పార్టీ నుంచి మరే పార్టీకి మారుతారో అస్సలు అర్థం కాదు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే.. కానీ సీబీఐ అధికారిగా ప్రజల్లో ప్రత్యేక పేరు తెచ్చుకున్న జే.డి. లక్ష్మీనారాయణ లాంటి వారు సైతం రాజకీయ పార్టీలో చేరడం.. అసంతృప్తితో పార్టీ నుంచి వెళ్లిపోవడం.. మళ్లీ పార్టీలోకి తిరిగి జాయిన్ అవుతుండం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారులు రాజకీయ పార్టీల్లోకి […]

Written By: NARESH, Updated On : November 17, 2020 12:29 pm
Follow us on

రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎవరు ఏ పార్టీల్లో ఉంటారో.. ఏ పార్టీ నుంచి మరే పార్టీకి మారుతారో అస్సలు అర్థం కాదు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే.. కానీ సీబీఐ అధికారిగా ప్రజల్లో ప్రత్యేక పేరు తెచ్చుకున్న జే.డి. లక్ష్మీనారాయణ లాంటి వారు సైతం రాజకీయ పార్టీలో చేరడం.. అసంతృప్తితో పార్టీ నుంచి వెళ్లిపోవడం.. మళ్లీ పార్టీలోకి తిరిగి జాయిన్ అవుతుండం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారులు రాజకీయ పార్టీల్లోకి వచ్చి నిలదొక్కకున్నవారు కొంతమందే ఉన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వారు రాజకీయాల్లో నిలకడగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: అజ్ఞాతవాసి పవన్ తో బీజేపీకి దెబ్బ పడుతోందా?

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు టేకప్ చేసిన జే.డి. లక్మీనారాయణకు ఆంధ్రలో సొంతంగా అభిమానులు ఉన్నారు. అదే ఊపుతో కొన్నేళ్ల కిందట పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చినా గెలువలేకపోయారు. అయితే ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొన్నా చురుగ్గా మాత్రం లేరనేది చెప్పాలి.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ డీలా పడడంతో జే.డీ. లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా మారడంతో పార్టీని పట్టించుకునేవారెవరూ లేరని అసంత్రుప్తి చెందారు. దీంతో బహిరంగ లేఖ రాసి జనసేనను వీడుతున్నట్లు చెప్పారు.

Also Read: బాబు బాటలో జగన్‌.. పుట్టిమునగడం ఖాయమా?

ఇటీవల కాలంలో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో రెండు పార్టీలు కలిసి పాల్గొంటుండడంతో ఇరు పార్టీల నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటు ఏపీ బీజేపీకి సోము వీర్రాజు ఆధ్వర్యంలో కొత్త నాయకత్వం రావడంతో కమంల పార్టీ బలపడుతోంది. మరోవైపు జనసేన అధినేత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో జే.డీ. లక్ష్మీ నారాయణ మళ్లీ జనసేనలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తగిన హామీ ఇస్తే పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఈసారైనా జే.డీ. తన రాజకీయ ప్రతాపాన్ని చూపిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్