Allu Arjun: ప్రస్తుతం ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను సాధించి పెట్టాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు…అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే తనకి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అందుకే అతన్ని కలవడానికి చాలామంది అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ను కలవడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయట…ఈ విషయాన్ని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా తెలియజేశారు. యాడ్ షూట్ చేసినప్పుడు అల్లు అర్జున్ మేనేజర్ చాలా కఠినమైన కండిషన్స్ పెట్టాడట… అతని కండ్లల్లోకి కండ్లు పెట్టి చూడకూడదట. తన ముందు కొంచెం ఎక్స్ట్రా కటింగ్స్ కూడా ఇవ్వకూడదని, తన ముందు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకూడదని చెప్పాడట. అలాగే తనకి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం లాంటివి చేయకూడదని చెప్పారట. అలా చేస్తే అతనికి కోపం వస్తుందంటూ తన మేనేజర్ చెప్పారట.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ను కలవడానికి చాలామంది అభిమానులు సైతం ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. వాళ్లందరికీ కూడా ఈ కండిషన్స్ వర్తిస్తాయని చెబుతున్నారు…ప్రస్తుతం ఆయన పెద్ద ఈవెంట్స్ కి హాజరు కావడం లేదు. దానివల్ల అభిమానులు సైతం అతనిని చూసే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు.
పుష్ప 2 సినిమా రిలీజైన సందర్భంగా రేవతి అని మహిళ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది. అందుకే ఆయన అప్పటి నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు. సెక్యూరిటీ ఉన్నప్పుడు మాత్రమే తను బయటికి వస్తున్నాడు. తన వల్ల ఇంకోసారి ఎప్పుడు ఘోరాలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తను ముందుగానే కి ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పుడు చేసే సినిమాలు ప్రయోగతకమైన మూవీస్ కావడంతో తను సక్సెస్ లను సాధిస్తాడా? తద్వారా ప్రేక్షకులను ఎలా అలరిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
